Youth Vote: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 12 వేల కోట్లు.. 20 లక్షల మంది విద్యార్థుల ఇష్యూ ఇది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తావిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 48 గంటల నిరాహార దీక్షకు ప్లాన్ చేశారు. పోలీసు అనుమతి లేకపోయినా కొనసాగిస్తామని ప్రకటించారు.
Also Read: డేంజర్ జోన్లో 40 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు క్లాస్తో తమ్ముళ్లలో వణుకు!
యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేరలేదని కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారు. కాలేజీలు సర్టిఫికెట్లు అడ్డుపెట్టుకుంటున్నాయంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే యూత్ను బీజేపీ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. నిజానికి తెలంగాణలో బీజేపీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సైలెంట్ గా ఫాలో అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయ్. జెన్ జీ యాంగిల్ మారుతోంది. అందుకే తెలంగాణలో యువత నిజంగా బీజేపీవైపు కదిలి వస్తుందా? తెలంగాణలో జెన్జీ అస్త్రం పనిచేస్తుందా?