Konda Surekha: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయ్. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. అటు పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి ఏఐసీసీకి రిపోర్ట్ పంపింది. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నట్లు సమాచారం.
Also Read: ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!
నిన్నటికి నిన్న కొండా సురేఖ బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. కానీ రిలీఫ్ దక్కలేదంటున్నారు. సీఎం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని ఖర్గే స్పష్టం చేశారంటున్నారు. మెజార్టీ నేతలైతే బర్తరఫ్కే మొగ్గు చూపుతున్నారు. అదే జరిగితే మంత్రివర్గంలోనూ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. మరి కాంగ్రెస్ లో కొండా ఎపిసోడ్ ఎలా ముగుస్తుంది? జరగబోయేదేంటి?