Illegal Buildings: మాదాపూర్ అంజయ్యనగర్లో 50 చదరపు గజాల జాగాలో జీ ప్లస్ 6 అంతస్తుల అక్రమ నిర్మాణం కూలిపోయి ఇద్దరు కార్మికులు చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. బిల్డర్ సాజిద్… ఇదే ప్రాంతంలో మరో ఐదు అక్రమ బిల్డింగ్లు కట్టినట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేట్ హాస్టళ్లకు డిమాండ్ చాలా ఉండటంతో చిన్న ప్లాట్లలోనే ఎత్తైన భవనాలు ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు.
Also Read: జెన్ జీ ఓటర్లను ఆకర్షించేందుకు కమలం స్కెచ్.. ఫీజు పోరుతో రోడ్డెక్కిన BJYM!
అంజయ్యనగర్, సిద్ధిఖ్నగర్లోనే వందల సంఖ్యలో అనుమతి లేని నిర్మాణాలున్నాయ్. సెట్బ్యాక్లు అసలే లేవు. నాణ్యత లేదు, నోటీసులు ఇచ్చినా నిర్మాణం కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. హైడ్రా, సీఎంసీ సర్వే మొదలుపెట్టాయి. కానీ ప్రశ్న అలాగే ఉంది. యజమానుల నుంచి ముడుపులు తీసుకుని సైలెంట్గా ఉండడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. ఇన్నేసి అక్రమ బిల్డింగ్లను ఏం చేయబోతున్నారు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే చర్యలు తీసుకుంటారు?