Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం ఫలించింది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ను మోడి ప్రారంభించనున్నారు. అయితే విమానం ఎగరడానికి ముందే.. క్రెడిట్ రాజకీయాలు టేకాఫ్ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలని జగన్ అంటుంటే కూటమి ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుందని అధికార పార్టీలు అంటున్నాయి.
ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు జగన్. అసలు ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది తామేనని చంద్రబాబు అంటున్నారు. ఒక రకంగా చూస్తే ప్రాజెక్ట్కు విజన్, ఊపిరి ఊదడంలో చంద్రబాబు మార్క్ కనిపిస్తే చిక్కుముడులు విప్పి పనులను పట్టాలెక్కించడంలో జగన్ సంతకం స్పష్టంగా ఉంది.
Also Read: ఏపీకి 7 ఎయిర్పోర్టులు.. తెలంగాణకు మాత్రం ఒక్కటేనా!
ఇక్కడ ప్రాజెక్ట్కు దిశ చూపిన ప్రభుత్వం ఒకటి. భూ సేకరణ, కోర్టు కేసులు, రైతుల అభ్యంతరాలు, కన్సెషన్ ఒప్పందాలు పూర్తి చేసి నిర్మాణానికి బాటలు వేసిన ప్రభుత్వం మరోటి. చివరికి పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవం నిర్వహిస్తోంది కూటమి ప్రభుత్వం. అంటే ఈ ఎయిర్పోర్ట్ ఒక్క ప్రభుత్వ కష్టం కాదు. మూడు దశల్లో సాగిన పరిపాలనా ప్రయాణం. భోగాపురం ఎయిర్పోర్ట్పై అసలు పేరు ఏ నాయకుడిదీ కాదు. ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరిన విజయగాథ మాత్రమే.
Also Reed: పేపర్ లీకేజీకి పాల్పడితే మీ జీవితం క్లోజ్.. 2026 కొత్త చట్టం తెచ్చిన మార్పులివే!