Exam Malpractice: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయ మార్గాల నిరోధక) సవరణ బిల్లుకు 2026 చట్టరూపం దాల్చింది. దేశ పార్లమెంట్ ఉభయసభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. దీంతో ఈ బిల్లు చట్టబద్దమైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయ మార్గాల నిరోధక) సవరణ బిల్లు 2026కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఇది అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి ఆమోదంతో ప్రశ్నపత్రాల లీక్, పరీక్షల్లో మోసాలకు సంబంధించిన నేరాలపై శిక్షలు గతం కంటే మరింత కఠినతరం చేశారు.
ఈ ప్రధాన నేరాలకు కనిష్ఠ జైలు శిక్ష 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల విధించే అవకాశం కల్పించారు. జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు. సంస్థలు లేదా సంఘటిత నేరాలకు పాల్బడితే గరిష్ఠ జరిమానా 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచుతారు. జైలు శిక్షను 8 సంవత్సరాల వరకు పెంచుతూ చట్టం చేశారు. దీంతో పునరావృత నేరాలకు కూడా శిక్షలు, జరిమానాలు మరింత పెంచారు. ఇకపై పేపర్ లీకేజీలలో దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఏర్పాటు చేసే అధికారంకూడా కల్పించారు.
Also Read: టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!
ఈ చట్టం ప్రకారం ప్రతి కేసు దర్యాప్తును కనీసం 2 నెలల్లోపు పూర్తి చేయడం తప్పనిసరి చేసారు. వీటికోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, కేసులను రోజువారీ విచారణతో చార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోపు పూర్తి చేయాలని చట్టం తెలుపుతుంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ చట్టానికి సంబంధించిన కేసులను కూడా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి, 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని నిబంధనను చేర్చారు. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల తీర్పులపై హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్కు అప్పీల్ చేసే అవకాశం కల్పించారు. అప్పీలను కూడా సాధ్యమైనంత వరకు 3 నెలల్లో పరిష్కరించాలని చట్టం పేర్కోంటుంది.
Also Read: నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!