Nithyananda: నిత్యానంద స్వామి.. అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఇది. అపార భక్తగణంతో పాటు.. అనేక వివాదాలకు కేరాఫ్ నిత్యానంద. ప్రస్తుతం కైలాస దేశంలో సెటిలైన నిత్యానంద సడెన్గా ఇప్పుడు తెరపై ప్రత్యక్షమయ్యారు. అక్షయ తృతీయ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
నిత్యానందకు బిగ్ టీవీ కూడా పలు ప్రశ్నలు సంధించింది. అయితే సమయం సరిపోకపోవడంతో సమాధానం ఇవ్వలేకపోతున్నానని.. బిగ్ టీవీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రత్యేకంగా సత్సంగ్ నిర్వహిస్తానని తెలిపారు AI నిత్యానంద. అంతేకాదు బిగ్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇస్తానన్నారు.
బిగ్టీవీ సంధించిన ప్రశ్నలేంటి అంటే.. మీడియాలో తరచుగా స్వామీజీల జీవితాలు సంచలనాత్మకంగా మారుతాయి కదా.. మీ గురించి కూడా ఇలా చాలా కథనాలు వచ్చాయి.. వాటిల్లో మీకు బాగా ఇబ్బందికరంగా అనిపించిన అంశం ఏంటి?
రెండో ప్రశ్న.. ఒకప్పుడు దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మికవాదిగా ఉండేవారు.. అధిక సంఖ్యలో భక్తులు ఉండేవారు. కానీ ఇప్పడు మీరు దేశంలో ఉండడంలేదు. బయట ఎక్కడా కనిపించడంలేదు.. మీపై గతంలో ఉన్నభక్తి ఇప్పుడు ప్రజలకు లేదనిపిస్తుంది? మీరేమంటారు?
మూడో ప్రశ్న.. మీ భక్తులు చాలా మంది మీరు సృష్టించిన కైలాసదేశానికి రావాలనుకుంటున్నారు.. వారికి ఎప్పుడు ఆ అవకాశం లభిస్తుంది? అసలు మీరు కైలాసదేశంలో ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు?
చాలా మంది కైలాస దేశం ఊహాజనితమైది అంటున్నారు.. మీరు కైలాసను ఇంకా ఎందుకు రహస్యంగా ఉంచాలనుకుంటున్నారు? అసలు ఈ కైలాస దేశం ఎగ్జాక్ట్గా ఎక్కడుంది? దానికి సంబంధించిన లోకేషన్ను ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారు.
Also Read: నేటి నుంచి చార్ ధామ్ యాత్ర షురూ.. తెరుచుకోనున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు
పై ప్రశ్నలను బిగ్ టివి నిత్యానందను అడిగింది? అక్షయ తృతియ సందేశం భక్తులకు ఇవ్వడంతోనే సమయం ముగిసి పోవడంతో మరోసారి తాను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తానని ప్రత్యేకంగా బిగ్ టివి లైవ్ ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానంటూ ఇప్పుడు జవాబు ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలంటూ కోరారు నిత్యనందా.