Government Schools: ఈ దేశంలో కోట్లాది మందికి అక్షరం నేర్పింది. కలలకు ప్రాణం పోసింది ప్రభుత్వ బడులే. కీలక శాఖల్లోని సీనియర్ ఆఫీసర్లలో చాలా మంది ప్రభుత్వ బడి ఒడిలోనే అక్షరాలు దిద్దారు. కార్పొరేట్ చదువులొచ్చి ప్రభుత్వ బడులు కళ తప్పుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాఠశాలలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేసిన కృష్టికి ప్రభుత్వ బడుల్లో పెరిగిన అడ్మిషన్లే సాక్ష్యమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా 8వేల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అయితే అడ్మిషన్లు పెరిగినందుకు రాజీనామా చేయాలా? అని సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్లో బిగ్ డిబేట్ పాయింట్గా మారింది.
Also Read: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?