Jana Sena: జనసేన ఒకప్పటిలా లేదు. అధికారంలోకి వచ్చాక పార్టీలో సీన్ మారిపోయింది. ఇప్పుడంతా గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయ్. చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే పాత కమిటీలు, అధికార ప్రతినిధుల పోస్టులు రద్దయిపోయాయ్. దీనిపై ఒరిజినల్ జనసైనికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కష్టకాలంలో పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్లని పక్కనబెట్టి, కొత్త నాయకత్వం పేరిట వేరేవాళ్లకు పీఠం వేస్తున్నారన్న గుసగుసలు కేడర్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Also Read: లంచం ఇస్తేనే పని జరుగుతుందా.. ఏపీలో అవినీతికి అడ్డులేదా..!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తమకే కావాలని జనసేన నేతలు పట్టుబడుతుంటే.. టీడీపీ మాత్రం 15 శాతానికి మించి ఇచ్చేది లేదంటోంది. పార్టీ గెలుపు కోసం తమను వాడుకొని లోకల్ ఎలక్షన్ల ముందు కమిటీలు రద్దు చేయడమేంటనే అసహనం కనిపిస్తోంది. జనసేనలో పరిణామాలు చూస్తుంటే.. గెలుపు కోసం వాడుకోవడం, అధికారం రాగానే పక్కన పెట్టడం అనే పాత రాజకీయ సూత్రమే ఇక్కడ కూడా అమలవుతోందా? అనే అనుమానం కలుగుతోంది.
Also Reda: పోలీసుల షాక్.. జగన్కు నో ఎంట్రీ!