Mega DSC: ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ‘మెగా డీఎస్సీ 2025’ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమైంది. రాష్ట్ర రాజకీయాల్లో వర్గాల్లో పెద్ద చర్చకు తీసింది. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగాల విక్రయం, భారీ స్థాయిలో అవినీతి జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు.
ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి రోజాతో పాటు ఇతర ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. నియామకాల్లో పారదర్శకత కోసం హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీబీఐ చేత నిష్పాక్షిక విచారణ జరిపించాలని తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి.
మరోవైపు, ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చిన ప్రభుత్వం.. ఏ తప్పు జరగలేదని స్పష్టం చేస్తూ బహిరంగ చర్చకు సవాలు విసిరింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారింది.