Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆయన కోడలు మేఘన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించడమే కాక పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తకు ఉన్న శారీరక లోపాన్ని దాచి పెళ్లి చేశారని, ఉదయం అగర్బత్తీ వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్టు ఉందంటూ అవమానించారని పేర్కొన్నారు.
వారి కుటుంబం క్రైస్తవంలోకి మారడంతో తనను గుడికి కూడా వెళ్ల నివ్వలేదని తెలిపారు. భయంతో సూర్యపేటలో తలదాచుకున్న తన్ను గత ఏడాది ఆగష్టు 26న పుట్టింటికి పంపేశారని చెప్పారు. అంతేకాకుండా గోవాలో బోటు నుండి తోసేసి చంపడానికి ప్రయత్నించారని, ఫిబ్రవరి 1న వారి ఇంటిపై జరిగిన పెట్రోల్ దాడి కేవలం ఒక డ్రామా అని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలతో జోగి రమేష్ కుటుంబం మరిన్ని చిక్కుల్లో పడింది.