HYDRAA: హైడ్రా వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కమిషనర్ రంగనాథ్ను వెంటనే పదవి నుంచి తప్పించాలని, అసలు హైడ్రానే రద్దు చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రా పనితీరు ఆగదని, దాన్ని కచ్చితంగా కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు.
ఈ రాజకీయ రగడపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంతే ఘాటుగా స్పందించారు. బడాబాబులు కాజేసిన వేల కోట్ల విలువైదన ఆక్రమిత భూములను, చెరువులను హైడ్రా కాపాడుతోందనే కక్షతోనే తమపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ధనబలంతో కొందరు పెద్దలు కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రతిపక్షాల హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వ మద్దతుతో రంగనాథ్ సమర్థనల నడుమ ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై బిగ్ టీవీ ఎడిటోరియల్ టీమ్ మరింత విశ్లేషణాత్మక కథనాన్ని అందించింది.