Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లోని మచిలీ పట్నంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన 7వ యాంటీ-సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రారంభం సందర్బంగా భారత నావికాదలంలో మరో కీలక అడుగు ముందుకు పడిందటూ ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దేశ ప్రదాని నరేంద్ర మోడి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎంతో కృషి చేసారని అన్నారు.
ఏపీ సముద్ర వారసత్వానికి గౌరవ సూచకంగా పేరుతో పాటుగా భారత నౌకాదళ శక్తి మరింత బలోపేతం తీర ప్రాంత భద్రత, సముద్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో కీలక అడుగు పడిదని పవన్ కళ్యాన్ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ రంగానికి ఊతం లభించిందని INS మచిలీపట్నం దేశ సముద్ర సరిహద్దులకు కవచంగా నిలుస్తుంది పవన్ కళ్యాణ్ కొనియాడారు.
Also Read: గోల్డ్ స్కామ్లో ఇరుక్కున్న ‘లఫూట్ గ్యాంగ్’ నిర్మాత, ఏం చేశాడంటే?
ఈ నౌకకు ఏపీకీ సముద్ర చరిత్రలో ఓక విశిష్ట స్థానం కలిగిన చారిత్రాత్మక ఓడరేవు అయిన మచిలీపట్నం పేరును పెట్టడం ఎంతో గర్వించదగ్గ విషయమని పలువురు కొనియాడారు. దేశంలో ఆనాటి పూర్వకాలం నుండి మచిలీపట్ననికి అంతర్జాతీయంగా కానీ వాణిజ్యం, కళలు, నౌకాయానాని ఆనాడు ప్రదాన నగరంగా పేరుంది.రాష్ట్రంలో నావికా రంగానికి అందించిన సేవలకు గుర్తుగా ఈ కొత్త నౌకకు మచిలీ పట్నం పేరుపెట్టడం గర్వించదగ్గ విషయం అని పలువురు కొనియాడారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన 6 శిక్షలు.. ఇది చదివితేనే చెమటలు పట్టేస్తాయ్!