E-Paper
Advertisement

ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇండ్ల పత్రాల జారీకి డేట్ ఫిక్స్!

ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇండ్ల పత్రాల జారీకి డేట్ ఫిక్స్!
Advertisement

Indiramma Towers: స్వేచ్ఛ బ్యూరో: ఇందిరమ్మ టవర్స్‌ ఎల్ఐజీ గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్‌ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మిగిలిన అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలిపారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు కేటాయించబడుతుందా లేదా అనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన మరియు అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

బ్రోకర్లు వద్దకు వెల్లవద్దు..

ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఇల్లు మంజూరు చేయిస్తామని లేదా అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయక లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.“గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు, మధ్యవర్తులు లేదా ఇతర వ్యక్తులకు ఎలాంటి పాత్ర లేదు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ లేదా ఇతర రూపంలో డబ్బులు చెల్లించవద్దు. గృహాల కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన అర్హతలు మరియు అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుంది” అని గౌతమ్ స్పష్టం చేశారు.గృహానికి సంబంధించిన మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించాల్సిన మొత్తం, చెల్లింపు గడువు , ఇతర సూచనలను కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. కేటాయింపు పత్రంలో పేర్కొన్న అధికారిక బ్యాంకు ఖాతాకు మాత్రమే నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని సూచించారు.

Advertisement

Also read: దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్

తెలంగాణ హౌసింగ్ బోర్డు..

ఇతర వ్యక్తులు తెలిపే ఖాతాలకు లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ చేయవద్దని హెచ్చరించారు. ఇల్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా లేదా అనధికారిక ఖాతాలకు చెల్లించాలని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులు గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయింపు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ tghb.telangana.gov.in⁠ ను సందర్శించవచ్చు లేదా కాల్‌ సెంటర్ నంబరు 040-24603572ను సంప్రదించవచ్చు. తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారికంగా జారీ చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు, సంబంధిత అధికారుల సూచనలను మాత్రమే విశ్వసించాలని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also read: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

Tags

Related News

జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే అదనపు ఫీజు!

150 మంది శ్రామికుల కష్టం.. ఖైరతాబాద్ గణేష్ వెనుక ఉన్న అసలు నిజాలివే!

హైదరాబాద్ ప్రజలకు బిగ్ షాక్.. ఆస్తి పన్నులో కీలక మార్పులు..!

ఢిల్లీ బ్రిక్స్ వేదికలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంచలనం.. ప్రపంచ దేశాలకు వార్నింగ్!

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలా.. జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌లో క్రేజీ అవినీతి!

కిచిడీ అమ్ముతూ.. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన అన్నదమ్ములు!

నెల్లూరు స్థానిక ఎన్నికల్లో సంచలనం.. కూటమికి ఛాలెంజ్‌గా సీట్ల రగడ!

Big Stories

Advertisement
×