E-Paper
Advertisement

Kaleshwaram: కేటీఆర్ సవాల్‌కు సర్కార్ కౌంటర్.. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ హీట్ పాలిటిక్స్!

Kaleshwaram: కేటీఆర్ సవాల్‌కు సర్కార్ కౌంటర్.. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ హీట్ పాలిటిక్స్!
Advertisement

Kaleshwaram: కాళేశ్వరం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. కేటీఆర్ కన్నేపల్లి టూర్ తో మళ్లీ పొలిటికల్ సెగలు పీక్స్ కు చేరాయి. AE, DE, SEలను ఇవ్వండి.. వారం రోజుల్లో రిజర్వాయర్లలో నీటిని నింపుతామంటున్నారు కేటీఆర్‌. అసలు ఆ పని చేయలేం.. నీటి నిల్వ చేయవద్దని NDSA చెప్పిందంటున్నారు మంత్రి ఉత్తమ్‌ ఇద్దరి మాటల్లో వాస్తవం ఏంటి అనేది పక్కనబెడితే ఇది పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నది మాత్రం కన్ఫామ్‌.

రివర్స్‌ ఎటాక్‌..

రెండు పిల్లర్ల సమస్యను ప్రాజెక్టు సమస్యగా మార్చారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. ఇది రెండు పిల్లర్లు, రెండు గేట్ల సమస్య కాదని.. టోటల్‌ గా ప్రాజెక్టు సమస్యే అని రివర్స్‌ ఎటాక్‌ చేశారు మంత్రులు. ఒకవేళ మొండిగా నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాచలం పట్టణంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని ఇంజినీర్లు హెచ్చరించినట్లు మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు.

Advertisement

Also Read: Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?

అది పొలిటికల్‌ టూర్‌..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లో లోపాలు, కుంగిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. NDSA నిపుణుల కమిటీ సిఫారసులతో, నిర్మాణ సమస్యలు, కుంగిపోయిన పిల్లర్ల కారణంగా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్లే బ్యారేజీల గేట్లను ఎత్తివేసి, నీటిని ఫ్రీ ఫ్లో కింద రివర్‌ లోకి వదిలేస్తున్నారు. బ్యారేజీలకు రిపేర్లు పూర్తి అయ్యే వరకు CWC, NDSA నుండి క్లియరెన్స్ వచ్చే వరకు వాటర్‌ స్టోరేజ్‌ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు కేటీఆర్‌ ఎన్నిసార్లు కాళేశ్వరం టూర్‌ చేపట్టినా.. అది పొలిటికల్‌ టూర్‌ అని ప్రభుత్వం నుంచి కౌంటర్లు వస్తూనే ఉంటాయి.

Advertisement

Also Read: Ayodhya Donations: అయోధ్య సిట్ విచారణలో షాకింగ్ నిజాలు.. రోజుకు రూ.8 లక్షలు నొక్కేస్తూ లగ్జరీ లైఫ్..!

Related News

కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇప్పుడు జగ్గయ్యపేటలో.. రిటైర్డ్ శాస్త్రవేత్త వినూత్న ప్రయోగం!

సామాన్యుడికో న్యాయం.. ఎంపీ కొడుక్కో న్యాయమా? ఇనార్బిట్ మాల్ ప్రమాదంపై రగులుతున్న చర్చ!

బిఆర్ఎస్ కొత్త జనతా గ్యారేజ్ వ్యూహం.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్!

కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రెడీ..?

జైపూర్ స్కూల్ విజిట్‌లో ఉద్రిక్తత.. సీజేపీ నేత అశుతోష్ రాంకా, కార్యకర్తలపై రాళ్ల దాడి!

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. ఈడీ ఎంట్రీతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో వనుకు!

వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదా.. బయటపడిన షాకింగ్ సర్వే వివరాలు!

ఏపీ కూటమిలో ముదురుతున్న సీట్ల సమరం.. బీజేపీ, జనసేనల సొంత అజెండా పై ఫోకస్!

Big Stories

Advertisement
×