Kaleshwaram: కాళేశ్వరం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. కేటీఆర్ కన్నేపల్లి టూర్ తో మళ్లీ పొలిటికల్ సెగలు పీక్స్ కు చేరాయి. AE, DE, SEలను ఇవ్వండి.. వారం రోజుల్లో రిజర్వాయర్లలో నీటిని నింపుతామంటున్నారు కేటీఆర్. అసలు ఆ పని చేయలేం.. నీటి నిల్వ చేయవద్దని NDSA చెప్పిందంటున్నారు మంత్రి ఉత్తమ్ ఇద్దరి మాటల్లో వాస్తవం ఏంటి అనేది పక్కనబెడితే ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నది మాత్రం కన్ఫామ్.
రెండు పిల్లర్ల సమస్యను ప్రాజెక్టు సమస్యగా మార్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇది రెండు పిల్లర్లు, రెండు గేట్ల సమస్య కాదని.. టోటల్ గా ప్రాజెక్టు సమస్యే అని రివర్స్ ఎటాక్ చేశారు మంత్రులు. ఒకవేళ మొండిగా నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాచలం పట్టణంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని ఇంజినీర్లు హెచ్చరించినట్లు మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు.
Also Read: Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లో లోపాలు, కుంగిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. NDSA నిపుణుల కమిటీ సిఫారసులతో, నిర్మాణ సమస్యలు, కుంగిపోయిన పిల్లర్ల కారణంగా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్లే బ్యారేజీల గేట్లను ఎత్తివేసి, నీటిని ఫ్రీ ఫ్లో కింద రివర్ లోకి వదిలేస్తున్నారు. బ్యారేజీలకు రిపేర్లు పూర్తి అయ్యే వరకు CWC, NDSA నుండి క్లియరెన్స్ వచ్చే వరకు వాటర్ స్టోరేజ్ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు కేటీఆర్ ఎన్నిసార్లు కాళేశ్వరం టూర్ చేపట్టినా.. అది పొలిటికల్ టూర్ అని ప్రభుత్వం నుంచి కౌంటర్లు వస్తూనే ఉంటాయి.