Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. ఇప్పుడు నితిన్ నబిన్ రాజీనామాతో బంకీపూర్ బరిలోకి. ఓడిపోతే తిరిగి పొలిటికల్ స్ట్రాటజిస్టుగా వస్తారా? అసలేంటీ వ్యూహకర్త వ్యూహం?
పొలిటికల్ స్ట్రేటజిస్ట్ పీకే- ఫుల్ టైం పొలిటీషియన్ గా మారి- జన్ సూరాజ్ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. గత బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదీ పార్టీ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామాతో, బీహార్ లోని బకీంపూర్ సీటు ఖాళీ అయ్యింది. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటు నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
Also Read: Property Tax: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. త్వరలో ఆస్తి పన్ను డబుల్..?
బంకీపూర్- పాట్నా నగర పరిధిలోకి వచ్చే నియోజకవర్గం. విద్యావంతులు, పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే స్థానం. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున శతృఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా తదితరులు పోటీ చేసి ఓడిపోయారు. పీకే ఇక్కడ పోటీ చేయడం ద్వారా పట్టణ, యువ ఓటర్లలోకి తన జన్ సూరాజ్ బ్రాండ్ ఇమేజ్ మరింత బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు.
ఈ ఉప ఎన్నికలో గెలుపోటముల కంటే, తన పార్టీకి ప్రజల్లో ఎంతవరకు ఆదరణ ఉందో లైవ్ టెస్ట్ చేసుకోవడానికి దీన్నొక అవకాశంగా భావిస్తున్నారు పీకే. ఇప్పుడీ ఉప ఎన్నికలోనూ పీకే ఓడిపోతే, మళ్లీ పాత స్ట్రాటజిస్టు పోస్టుకు వెళ్తారా? లేక రాజకీయాల్లో ఇలాగే కొనసాగుతారా? అన్న చర్చకు తెరలేచింది.
Also read: 22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?