No UPI: మార్కెట్ లోకి కొత్త ఛాలెంజ్ వచ్చింది. అదే NO UPI ఛాలెంజ్. ఎస్.. ఎగ్జాక్ట్లీ ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి ఇదే ప్రయోగం చేసింది. ఒకప్పుడు రూపాయి ఖర్చు చేయాలన్నా జేబులోంచి నోటు తీసి లెక్కపెట్టేవాళ్లం. కానీ ఇప్పుడు స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు సెకన్లలో పింగ్ అని మెసేజ్ రావడం, అకౌంట్ ఖాళీ అవ్వడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఈ డిజిటల్ మాయలో పడి ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా చూడలేకపోతున్నాం.
సరిగ్గా ఈ పాయింట్నే క్యాచ్ చేసింది ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ సదఫ్. డిజిటల్ మనీ తెచ్చిపెడుతున్న అనవసర ఖర్చులకు చెక్ పెట్టడానికి వరుసగా రెండు నెలల పాటు UPI వాడకాన్ని పూర్తిగా ఆపేసింది. కేవలం లిక్విడ్ క్యాష్ను మాత్రమే తన డైలీ ఖర్చులకు వాడటం మొదలుపెట్టింది.
Also reda: దుబాయ్ ఫ్యామిలీ టూర్ వెళుతున్నారా? పిల్లలకు వీసా ఫ్రీ.. ఈ కండీషన్స్ పాటిస్తే
ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. UPI ఉన్నప్పుడు 20, 50 రూపాయలు లాంటి చిన్న చిన్న ఖర్చులు అస్సలు లెక్కలోకి వచ్చేవి కావట. కానీ, అదే జేబులోంచి కాగితం నోటు తీసి ఇచ్చేటప్పుడు మాత్రం.. అయ్యో డబ్బులు అయిపోతున్నాయి అన్న భయం కలిగి ఎక్
స్ ట్రా ఖర్చులకు బ్రేక్ పడింది అని చెబుతోంది.
ఈజీగా అయిపోతుందని మనం వాడుతున్న UPI, మన జేబులను ఎంతలా ఖాళీ చేస్తుందో ఈ ఢిల్లీ అమ్మాయి ప్రయోగం నిరూపించింది. మరి మీరూ మీ ఖర్చులకు బ్రేక్ వేయడానికి NO-UPI ఛాలెంజ్ ట్రై చేస్తారా?
Also Read: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ ధరలు భారీగా తగ్గింపు!