Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జనజీవన స్రవంతిలోకి సీనియర్ క్యాడర్కు చెందిన DCM నక్కా సుశీల రాణి కలిసి పోయారు. నిజామాబాద్ పోలీసుల ఎదుట DCM నక్కా సుశీల రాణిలొంగి పోయినట్టు సమాచారం. ఈమే గతంలో లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత పేర్లతో మావోయిస్టు పార్టీలో కార్యకలాపాలు నిర్వహించినట్టు సమాచారం.
ఛత్తీస్గఢ్ మాడ్ డివీసీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు మావోయిస్టు పార్టీలో కీలక వ్యక్తిగా ఈమే పనిచేశారు. మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా సుశీల రాణికి పేరుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్కు చెందిన నక్కా సుశీల స్వస్థలం. ఈమే హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అనంతరం నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట జనజీవన స్రవంతిలోకి చేరినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
Also read: ఏపీలో షాకింగ్ ఘటన.. డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై దాడి కలకలం!
మావొయిస్టు సిద్దాంతాలను వీటి జనజీవన స్రవంతిలోకి కలిసిపోతున్నట్టు ఆమే తెలిపారు. సుశీల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ అని పోలీసుల ప్రకటన చేశారు. పార్టీలో సీనియర్ నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆమేకు పేరుంది. సుశీల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పునర్నిర్మాణానికి కూడా ఇది ప్రతికూల పరిణామమని పోలీసుల వెల్లడించారు.
Also read: వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది