E-Paper
Advertisement

రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?

రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?
Advertisement

Yedukondalu Death: ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, ఘోరాల తీవ్రత కంటే.. వాటి చుట్టూ నడిచే రాజకీయాలు, మాటల యుద్ధాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఒక ఘటన జరగడమే ఆలస్యం, నిజా నిజాలు తేలకముందే పార్టీలు మైకులు పట్టుకుని విమర్శలు గుప్పించుకోవడం ఏపీ పాలిటిక్స్ లో కామన్ అయిపోయింది. తాజాగా నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఏడుకొండలు మృతి వ్యవహారం రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను ఒక్కసారిగా పెంచేసింది.

ఏడుకొండల మృతి.. కాకాణి వర్సెస్ సోమిరెడ్డి*

Advertisement

నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు మృతి చెందడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇది ముమ్మాటికీ పోలీసుల అత్యుత్సాహం వల్ల జరిగిన ‘లాకప్ డెత్’ అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మోటార్ల దొంగతనం కేసులో పోలీసులు ఏడుకొండలను ఎంక్వైరీ చేసి వదిలేశారని, దీనికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రెండోసారి విచారణకు పిలిస్తే రాలేదని, ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.

Also Read: ORR వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి!

Advertisement

సాయికృష్ణ ఎపిసోడ్ నుండి ఇదే ట్రెండ్

గతంలో జరిగిన సాయికృష్ణ వ్యవహారంలోనూ ఇరు పార్టీలు ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఇప్పుడు ఏడుకొండలు కేసులోనూ అదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో యాక్టివ్‌గా పనిచేసిన పోలీసులను, ప్రభుత్వం మారగానే ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడం ఇక్కడ రొటీన్‌గా మారింది. ‘మా పాలనలోనే లా అండ్ ఆర్డర్ బాగుంది’ అని ప్రజలకు ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఇరు పార్టీలు తాపత్రయపడుతున్నాయి.

నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి?

ఇలాంటి సున్నితమైన కేసుల్లో రాజకీయ విమర్శలు పక్కనపెట్టి, పారదర్శకంగా విచారణ జరిపించి నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అప్పుడే పోలీస్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. కానీ.. ఏపీలో మాత్రం సీన్ పూర్తిగా డిఫరెంట్. విచారణలు పక్కకెళ్లి, రాజకీయ బురదజల్లే కార్యక్రమాలే ఎక్కువగా నడుస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇకనైనా రాజకీయ పార్టీలు తమ పంథాను, స్టాండ్‌ను మార్చుకుంటాయా? లేదా ఇదే పొలిటికల్ డ్రామాను కంటిన్యూ చేస్తాయా? అనేది ప్రస్తుతానికైతే పెద్ద ప్రశ్నార్థకమే!

Also Read: 8 సార్లు పేలుళ్ల ట్రయల్స్.. గుజరాత్‌లో ‘జైష్’ ఉగ్ర కుట్ర భగ్నం.. 13 మంది అరెస్ట్!

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×