E-Paper
Advertisement

YSRCP: మూకుమ్మడిగా కేసులు.. కమ్ముకొస్తున్న కారు మబ్బులు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ

YSRCP: మూకుమ్మడిగా కేసులు.. కమ్ముకొస్తున్న కారు మబ్బులు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ
Advertisement

YSRCP: చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్, సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని ఇన్నాళ్లూ రెచ్చిపోయిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అండ చూసుకుని విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిన వారి చిట్టా అంతా బయటికొస్తోంది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ సోషల్ కార్యకర్తల అరెస్టులే కనిపిస్తున్నాయి. వాటి నుంచి రక్షణ కావాలంటూ వేసిన పిల్ పై ఏపీ హైకోర్టు ఎంటర్ టైన్ చేయలేదు. పైగా అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది.

అప్పుడు రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరార్

Advertisement

ఎస్.. ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ అండ చూసుకుని చేతిలో సెల్, అందులో ఇంటర్ నెట్ ఉంది కదా అని రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి తల దాచుకుంటున్నారు. అయినా సరే పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. తప్పు చేయనేల. ఇప్పుడు క్షమాపణలు చెప్పనేల అన్నట్లుగా సీన్ మారింది. తెలిసో తెలియకో చేశాం.. మమ్మల్ని వదిలేయండి మహా ప్రభో అని చాలా మంది వేడుకుంటున్న పరిస్థితి. మరి ఇదే బుద్ధి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సోషల్ వారియర్లపై BNS సెక్షన్ 111 ప్రయోగం

Advertisement

నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాల్సిన రీతిలో వాడకపోవడంతోనే సమస్య వచ్చింది. ప్రత్యర్థులపై హేట్ పోస్టులతో రెచ్చిపోయారు. అదే అన్నిటికీ మందు అనుకున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటో ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. నోటీసులు, కేసులు, అరెస్టులతో అందరిలోనూ పరేషాన్ కనిపిస్తోంది. ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టినా సరే అందరినీ గుర్తు పట్టేస్తున్నారు. లైకులు కొట్టినా, ఫార్వర్డ్ చేసినా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కట్టు దాటి కామెంట్లు పెట్టినా అందరూ బుక్ అవుతున్నారు. BNSS సెక్షన్ 111 ప్రయోగిస్తుండడంతో చాలా మంది కాళ్లబేరానికి వస్తున్నారు.

నేతల భార్యలే టార్గెట్ గా వ్యక్తిత్వ హననాలు

మంచి పనులు చేస్తూ ప్రజల్లో మెప్పు పొంది గెలవాలి. కానీ ప్రత్యర్థులను టార్గెట్ చేసి, వారి భార్యలపై వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా పబ్బం గడుపుకొందామంటే కుదురుతుందా.. కానే కాదు అని ఇప్పటి కేసులు, అరెస్టులు రుజువు చేస్తున్నాయి. గతంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు పుట్టలో ఉన్నా సరే వెతికి వెతికి బయటకు తీస్తున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా గట్టిగానే బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో గతంలో యాక్టివ్ గా పని చేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అంతా జైలు బాట పడుతున్నారు.

Also Read: లాజిక్‌తో కొట్టిన టీడీపీ.. జగన్ అసెంబ్లీకి రావాల్సిందేనా..?

సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఆపాలని పిల్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని, వాటిని అడ్డుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు చెప్పిన మాటలు సోషల్ వారియర్లు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించడం అందరూ ఆలోచించాల్సిన విషయం. గతంలో న్యాయమూర్తులను కూడా వదలకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది ధర్మాసనం. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్‌ వేయడానికి వీలు లేదన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలన్నది. సో హైకోర్టు చెప్పాల్సింది చెప్పేసింది. ఇది నిజంగా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బే.

చేసిన తప్పులకు ఫలితం అనుభవించాల్సిందే..

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం వర్కవుట్ కాలేదు. పైగా రివర్స్ అవుతోంది. ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత తప్పించుకుందామని చూసినా.. చేసిన తప్పులకు ఫలితం అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది ఇప్పుడే వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేసిన వారికి, ఆ పార్టీ సానుభూతి పరులకు అర్థమవుతోంది. నిజానికి ఈ విషయంలో మొదటే జ్ఞానోదయం కావాలి. కానీ ఇన్నాళ్లకు అవుతోంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే గెట్ రెడీ అంటోంది ఏపీ పోలీస్ వింగ్. వీళ్లు రాజకీయ విమర్శలతో పోస్టులు పెట్టి ఉంటే అంతా బాగుండేది. కానీ హద్దులు దాటి పెట్టారు. అందుకే వరుసగా నోటీసులు, కేసులు, అరెస్టులు.

 

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×