Bigg Boss 9 Telugu Live Updates:ఉత్కంఠకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ, ప్రేక్షకాదారణ పొందిన బిగ్ బాస్ షో కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు 8 సిజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. తొమ్మిదవ సీజన్ నేటితో మొదలైంది.
ఇక హౌజ్ లోకి ఫైనల్ కంటెస్టెంట్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు. నిజానికి ఇది ఆడియన్స్ కి సర్ప్రైజ్ అని చెప్పాలి. 14 మందితో ఫైనల్ చేసినప్పటికీ శ్రీముఖీ రిక్వెస్ట్ మేరకు నాగార్జున కామనర్స్ నుంచి మరో కంటెస్టెంట్ ని అలో చేశారు. అభిజిత్, శ్రీముఖి నిర్ణయం మేరకు కామనర్ మర్యాద మనీష్ ని ఎంపికై హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతోచివరికి హౌజ్ లోకి 15 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు.

హౌజ్ లో 14వ కంటెస్టెంట్ గా కామనర్ నుంచి ప్రియ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ప్రియా ముందంజలో ఉండటంతో.. ఫైనల్ కామనర్ కంటెస్టెంట్ గా ప్రియా హౌజ్ లోకి వెళ్లింది. ప్రొఫెషన్ గా డాక్టర్ కదా.. మరి బిగ్ బాస్ ఎందుకు వెళ్తున్నావ్ అని అడగ్గా.. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని ఉండేదని, కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో డ్రాప్ అయ్యానని చెప్పింది. అయితే బిగ్ బాస్ షో నుంచి తన కుటుంబంతో కలిసి చూస్తున్నామని, అమ్మ చెబితేనే అగ్నీ పరీక్ష కోసం అప్లై చేశానని ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్నానని చెప్పుకొచ్చింది. చివరి తను సింగిలా? కమిటెడ్ అని అడగ్గా.. సింగిల్ అంటూ కుర్రాళ్ల కు గుడ్ న్యూస్ చెప్పింది.

పదమూడో కంటెస్టెంట్ గా సెలబ్రిటీల నుంచి సుమన్ శెట్టి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాడు. నమస్కారం అధ్యక్ష నేను మీ సుమన్ శెట్టి.. అంటూ తనని పరిచయం చేసుకున్నాడు. డైరెక్టర్ తేజ జయం సినిమాతో సుమన్ కాస్తా సుమన్ శెట్టి అయ్యాడని చెప్పాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్ పూరి వంటి భాషల్లో నటించానన చెప్పాడు. అలా 300పైగా సినిమాలు చేసిన తాను ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోయానని చెప్పాడు. పెళ్లి, పిల్లలతో హ్యాపీ ఉన్న తన లైఫ్ లో తన తండ్రి మరణం తనని తీవ్రంగా కలిచివేసిందన్నాడు. తన తండ్రి మరణంతో ఒంటరి వాడిని అయిన నన్ను.. మా అమ్మ వెళ్లి నీ కెరీర్ మొదలు పెట్టు అంటూ నన్ను తట్టి లేపింది. ఫస్ట్ కెరీర్ లో తేజ గారు అవకాశం ఇచ్చారు.. కెరీర్ అలా వెళ్లింది.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్.. బిగ్ బాస్ అవకాశం ఇచ్చింది. బిగ్ బాస్ హౌజ్ కి వస్తున్నా.. ఈ సుమన్ శెట్టి ఆటేంటో చూపిస్తా అంటూ హౌజ్ లోకి వచ్చేసాడు.

జ్యారీ జడ్జీమెంట్ కింద నవదీప్ శ్రీజ దమ్మును కంటెస్టెంట్ గా ఎంపిక చేశాడు. దీంతో కామనర్స్ నుంచి నాలుగవ కంటెస్టెంట్ గా.. శ్రీజ దమ్ము బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఫిక్స్ అయ్యింది. స్టేజ్ పైకి వచ్చిన శ్రీజపై నవదీప్ ప్రశంసల వర్షం కురిపించింది. తన ఇంటిపేరులో ఉన్న దమ్మును..తనలో చూశానని, అందుకే తనని ఎంపిక చేశాడు నవదీప్. అగ్నీ పరీక్షలో తను వచ్చి రాగానే..తన అరుపులతో అందరిని ఇరిటేట్ చేసిందన్నాడు. కానీ, ఆ తర్వాత ఇలా అరిస్తే అందరూ టీవీ కట్టేసుకోవాల్సి వస్తుంది.. శ్రీముఖీ అనగానే.. అలా అంటే బిగ్ బాస్ సీజన్ 2లోనే టీవీ కట్టేయాలని అంటూ ఇచ్చిపడేసింది. అప్పుడే తన ధైర్యానికి తాను ఫిదా అయ్యానని చెప్పింది. తనకు ఏది అనిపిస్తే అది.. కాన్పిడెంట్ గా.. ఎలాంటి బెరకు లేకుండ బయటపెడుతున్న తన ధైర్యం తనకేంతో నచ్చిందని. ఇక ఆడియన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పుకుండ నెవవేరుస్తానని, ప్రతి ఒక్కరు తనని సపోర్టు చేయాలని స్టేజ్ పై ఓట్ అపిల్ మొదలుపెట్టింది.

పల్లె పాటలతో ఎంతో మంది ఫోక్ సాంగ్ ప్రియులను ఆకట్టుకున్నాడు రామ్ రాథోడ్. తన పాడిన ఫేమస్ సాంగ్ తోనే అతడు ఎంట్రీ ఇచ్చాడు. రాను ముంబైకి రాను పాటతో స్టేజ్ పై అదరగొట్టిన రామ్.. హోస్ట్ నాగ్ పై పాట పాడి ఇంప్రెస్ చేశాడు. బెసిగ్గా డ్యాన్సర్ అయిన రామ్ రాథోడ్.. ఎవరో పాటకు ఎందుకు డ్యాన్స్ చేయాలని.. మన పాటలపైనే డ్యాన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అలా లాక్ డౌన్ లో ఫోక్ సాంగ్స్ పాడుతూ..ఇలా ఎంతోమంది ప్రేమాభిమానాలను సంపాదించుకున్నానని చెప్పాడు. స్టేజ్ పై రామ్ రాథోడ్ గురించి నాగార్జున ఓ సీక్రెట్ రివీల్ చేశాడు. తను పాడిన రాను ముంబైకి రాను పాట మిస్ వరల్డ్ స్టేజ్ పై వినిపించేంతగా తన సక్సెస్ అని అందుకున్నాడంటూ అసలు విషయం రివీల్ చేశాడు.

పదవ కంటెస్టెంట్ గా బుచ్చిగాడు బ్యూటీ సంజన గల్రానీ.. ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీతోనే బుజ్జిగాడు అర్చన అంటూ ప్రేక్షకులను గుర్తు చేసింది. తన ఎనిమిదవ తరగతిలోనే తాను ఓ యాడ్ లో నటించి మోడల్ గా కెరీర్ ప్రారంభించానని చెప్పింది. ఆ యాడ్ లో తాను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సరసన నటించానంది. అది చూసి పూరీ తనని బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారిన చెప్పింది. ఇక ఆ తర్వాత లైఫ్ ఓ కేసు ఊహించని మలుపు తిప్పిందంటూ ఎమోషనల్ అయ్యింది. ఓ కేసులో తనని తప్పుగా ఇరికించారని, విచారణ అని పిలిచి అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను అలాంటి అమ్మాయిని కాదని ప్రూవ్ చేసుకునేందుకు బిగ్ బాస్ కి వచ్చానని చెప్పుకుంది. ఇక హౌజ్ లో తాను ఏంటో చూపిస్తాని సవాలు చేసింది.

తొమ్మిదవ కంటెస్టెంట్ గా మూడో కామనర్ హౌజ్ లోకి వెళ్లాడు. కామనర్స్ నుంచి మూడో కంటెస్టెంట్ డిమోన్ పవన్ ని స్వయంగా హోస్ట్ నాగార్జున ఎంపిక చేశాడు. అతడిని స్టేజ్ పైకి పలిచి కామనర్స్ నుంచ పవన్ ని హౌజ్ లో పింపించాడు. ఇక తన తోటి కామనర్స్ లో ఎవరూ తనతో ఉండాలని నాగ్.. పవన్ అడగ్గా.. తనతో పాటు హౌజ్ లో దమ్ము శ్రీజ ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పాడు.
హౌజ్ లోకి వెళ్లగానే డిమోన్ పవన్ తో సెలబ్రిటీలకు టాస్క్ ఇప్పించాడు. భరణి, రీతూ చౌదరిలో ఎవరూ కిచెన్ లో గిన్నెల కడిగే బాధ్యత ఎవరికి ఇస్తున్నావ్ అని అడగ్గా.. తాను రితూ చౌదరికి ఇవ్వాలనుకుంటున్నా అంటూ రితూని ఇరికించేశాడు. ఈ టాస్క్ తో వారం పాటు రితూ చౌదరి హౌజ్ లో గిన్నెలు కడగాల్సి ఉంటుంది.

ఎనిమిదవ కంటెస్టెంట్ రితూ చౌదరి స్టేజ్ పైకి వచ్చింది. దబిడి దబిడి నీ చేయి ఎత్తు బాల అంటూ బాలయ్య పాట గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బ్లూ డ్రెస్ తనదైన స్టేప్పులతో ఈ భామ స్టేజ్ పై దుమ్ము దులిపింది. అనే పాటకు స్టేప్పులతో స్టేజ్ పై అదరగొట్టింది. వచ్చిరాగానే హాలో దివ్య అంటూ నాగ్ ఆమెను ఏడిపించాడు. ప్లీజ్ సర్ నన్ను అలా పిలవద్దంటూ నాగ్ ను రిక్వెస్ట్ చేసింది. దివ్య పేరు తనకు ఎందుకు నచ్చదో వివరించింది. ఇది తన అసలు పేరని, స్కూల్లో ఉండగా.. తనతో పాటు మరో పది మందికి కూడా దివ్య పేరు ఉందని చెప్పింది. అందుకే పేరు మార్చుకోవాలని డిసైడ్ అయ్యి రితూ చౌదరి అని మార్చుకున్నాని చెప్పింది. ఇక రితూ చౌదరి సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్ మంచి గుర్తింపు పొంది. అప్పుడప్పు జబర్దస్త్ షోలోనూ అలరించింది. మరోవైపు టీవీ షోల్లోనూ అలరిస్తూ బుల్లితెరపై మంచి గుర్తింపు పొందింది.

బిగ్ బాస్ స్టేజ్ పైకి ఏడవ కంటెస్టెంట్ గా టీవీ నటుడు భరణీ వచ్చేసాడు. చిలస్ స్రవంతి సీరియల్ తో గుర్తింపు పొందిన భరణి.. టీవీ, సీరియల్లో విలన్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. బుల్లితెరపై పవర్ఫుల రూల్స్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతంగా చేసుకున్నాడు. చిన్న ఏవీతో తన బయోగ్రఫీని చూపించాడు. పవర్ఫుల్ ఏవీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి అంచనాలను తారుమారు చేస్తూ ఓ చిన్న పిల్లాడు. ఎవరూ ఆపలేనితుఫానుల మారిపోయాడు. అతని వయసుతో సమానంగా అతడికి భయపడుతూ వచ్చారు.
కోపపు నీడలో పెరిగిన అతడికి ఆవేశమే అతడి అస్థత్వంగా మారింది అంటూ తన వ్యక్తిత్వాన్ని పరిచయం చేసుకున్నాడు. ఓ సీక్రెట్ బాక్స్ తో స్టేజ్ పైకి వచ్చిన అతడు.. దానిని కూడా తన హౌజ్ లోకి తీసుకువెళతానని చెప్పాడు. ఇది తన బాడీలో ఒక భాగమని, దీనిని తనతో పాటు హౌజ్ లోకి తీసుకువెళతానని చెప్పాడు. కానీ, బిగ్ బాస్ దీనికి అంగీకరించాడు. దాంట్లోని సీక్రెట్ ఇక్కడే రివీల్ చేయలేనని, హౌజ్ లోనే రివీల్ చేస్తానని కండిషన్ పెట్టాడు. అయినా బిగ్ బాస్ ఒప్పుకోకపోవడంతో తాను ఇంటికి వెళ్లిపోతానని చెప్పాడు. స్టేజ్ నుంచి బయటకు వెళ్లిన భరణి ఆ తర్వాత కాసేపటికి బిగ్ బాస్ వెనక్కి పిలిచి హౌజ్ లోకి పంపించాడు. ఇక తన సీక్రెట్ బాక్స్ లో ఏముందో కూడా రివీల్ చేశాడు. అది ఒక చైన్, లాకెట్ అని చెబుతూ చూపించాడు.

హౌజ్ లోకి ఆరవ కంటెస్టెంట్ గా మరో కామనర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు.. మాస్క్ మ్యాన్ హరీష్ సెలక్ట్ అయ్యాడు. అగ్నీ పరీక్ష జ్యూరీగా ఉన్న బిందు మాధవి హరీష్ ని హౌజ్ కంటెస్టెంట్ గా ప్రకటించింది. ఇక స్టేజ్ పైకి వచ్చిన అతడి నాగ్ కొన్ని ప్రశ్నలు అడిగ్గా.. తనదైన సమాధానం హోస్ట్ మెప్పించాడు. ఇక హౌజ్ లోకి వెళ్లగానే తనూజ తో మాటలు కలుపుతూ మీ పేరు నాకు గుర్తుండిపోతుందంటూ ఇంప్రెస్ చేశాడు.

బిగ్ బాస్ స్టేజ్ పైకి అసలు కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చేసింది. ఢీ షోతో మాజీ కంటెస్టెంట్, జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ.. ఐదో కంటెస్టెంట్ గా వచ్చేసింది. వచ్చిరాగానే తన స్పిచ్ తో అమ్మాయిల్లో స్పూర్తి నింపింది. ఆ తర్వాత నాగ్ కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటకు కొరియోగ్రాఫీ చేసి ఫిదా చేసింది.

నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ అను ఇమ్మన్యుయేల్ వచ్చాడు. పలు కామెడీ షోలతో ప్రేక్షకుల ఆకట్టుకున్న అతడు విరూపాక్ష, గం గం గణేశా చిత్రాలతో వెండితెరపై కూడా అలరించాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోలతో బిజీగా ఉన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో ఆడియన్స్ నవ్వించేందుకు రెడీ అయ్యాడు. వచ్చి రాగానే తన టాలెంట్ చూపించాడు. ఫీమేల్ వాయిస్ తో పాట పాడి సర్ప్రైజ్ చేశాడు. అమ్మ అమ్మ అంటూ ఆడ, మగ గొంతు మారుస్తూ.. తన టాలెంట్ చూపించాడు. మరి హౌజ్ లో ఇమ్మాన్యుయేల్ తన టాలెంట్ ఎలా అదరగొడతాడో చూడాలి.

కామనర్స్ లో తొలి కంటెస్టెంట్ కళ్యాణ్ ఫైనల్ అయ్యాడు. ఇద్దరు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తర్వాత హోస్ట్ నాగ్ కామనర్ కంటెస్టెంట్ గా కళ్యాణ్ ని ప్రకటించారు. రైట్ సోల్జర్ కమ్ టూ ది బిగ్ బాస్. ఇక హౌజ్ లో తనతో పాటు కామనర్స్ లో తనతో ఎవరూ హౌజ్ లో ఉంటే బాగుంటుందని అడగ్గా.. ప్రియ అని చెప్పాడు.

హౌజ్ లో రెండో కంటెస్టెంట్ గా నటి, ఒకప్పటి హీరోయిన్ ఆశ షైనీ ఎంట్రీ ఇచ్చింది. వైబ్ ఉంది బేబీ.. అంటూ తన వైబ్ స్టేజ్ పై ఆకట్టుకుంది. వచ్చి రాగానే తన అసలు పేరు వెల్లడించింది. తన పేరు ఆశ షైనీ కాదని, ఫ్లోరా షైనీ అని పరిచయం చేసుకుంది.

బిగ్ బాస్ హౌజ్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ బుల్లితెర భామ, సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చింది. జరగండి జరగండి అంటూ క్రేస్ఫుల్ డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చింది.

ఉత్కంఠకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ, ప్రేక్షకాదారణ పొందిన బిగ్ బాస్ షో కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు 8 సిజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. తొమ్మిదవ సీజన్ నేటితో మొదలైంది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. సూటు బూటుతో స్టైలిష్ లుక్ ఫిదా చేశాడు. కూలీ మూవీలో సైమన్ లా నాగ్ ఎంట్రీని గట్టిగానే ప్లాన్ చేశారు. ఎంట్రా చూస్తండావ్.. కింగ్ వచ్చింది అంటూ వచ్చి రాగానే మాస్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. సోనియా సోనియా అంటూ సైలిష్ స్టెపులతో ఆకట్టుకున్నాడు ఈ మన్మథుడు.

ఈ బిగ్బాస్ సీజన్ 9లో సామాన్యులు ఎంటర్ కాబోతున్నార హోస్ట్ నాగార్జున ప్రకటన ఈ ప్రొమో మొదలైంది. ఆవెంటనే శ్రీముఖి స్టేజ్ మీదకు వచ్చింది. శ్రీముఖిని చూడగానే నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. నాగ్ ఆమెకు పొగిడేశాడు.ఇక శ్రీముఖి నాగార్జునని ఆకాశానికి ఎత్తేస్తూ ‘మా ఆడవాళ్లు అందరికీ నాగార్జున గారు నచ్చడం చాలా కామన్.. ఎందుకంటే మీరు మా మానసు దోచుకున్న సైమన్’ అంటూ డైలాగ్ విసిరి హోస్ట్ ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత బిందు మాధవి, నవదీప్, అభిచిత్ ఎంట్రీలు ఇచ్చారు. ఇక కామనర్స్ లో హౌజ్ లోకి వెళ్లేది ఎవరో జడ్జస్ డిసైడ్ చేస్తారంటూ నాగార్జున అనౌన్స్మెంట్తో ప్రొమో ముగస్తుంది.
మరికొన్ని గంటల్లో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ రోజు (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు బిగ్బాస్ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) షో గ్రాండ్గా లాంచ్ కాబోతోంది. ఈసారి డబుల్ హౌజ్, డబుల్ డోస్తో ఈ రియాలిటీ ఫైర్ స్ట్రోమ్గా ఉంటుందంటూ హో స్ట్ నాగార్జున హైప్ పెంచుతున్నారు. కాసేపటి క్రితం విడుదలైన ప్రొమోలో హౌజ్ని పరిచయం చేశాడు. రెండు హౌజ్లతో బిగ్బాస్ కనువిందు చేసింది. సెకండ్ హౌజ్ అవుట్ స్టాండింగ్ అంటూ క్యూరియాసిటీ పెంచాడు హోస్ట్. కంటెస్టెంట్స్ని కూడా పరిచయం చేశాడు.
కానీ, వాళ్లు ఎవరనేది చూపించకుండ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. కొత్త బిగ్బాస్, సరికొత్త టీం, సరికొత్త కాన్సెప్ట్లో ఈ రియాలిటీ షోలో ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయబోతుందని ప్రొమో చూస్తే అర్థమైపోతుంది. లాంచ్ డే రోజే ఎవరూ ఊహించని మలుపు ఉండబోతుందని తెలుస్తోంది. ఎంట్రీ స్టేజ్పై నుంచే కంటెస్టెంట్ వెనక్కి వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కాన్పీడెన్స్ చూస్తుంటే నెక్ట్స్ లెవెల్ అనేట్టుగా ఉంది. పిక్చర్ అబీ భాకీ హై అంటూ ఆశా షైనీ ఫైర్ స్ట్రోమ్ పెంచింది. మరి హోస్ట్ చెప్పినట్టుగానే ఈసారి హౌజ్ రణరంగమే అన్నట్టు ఉంది.. కంటెస్టెంట్స్ ఫైర్ చూస్తుంటే.
ఈ ప్రొమో చూస్తుంటే ముందు నుంచి వినిపిస్తున్న పేర్లే.. స్టేజ్పై వినిపించాయి. రాము రాథోడ్, రితూ చౌదరి, భరణి శకంర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ గౌడ్, నటి ఆశా షైనీ, సంజన గల్రానీ, ఉమెన్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి, సుమన్ శెట్టి, ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కామనర్స్ నుంచి శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్లు కన్ఫాం అయ్యారు.