Aprilia india : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఏప్రిలియా కొత్త సూపర్ బైక్ను లాంచ్ చేసింది. ఇంతక ముందు మూడు బైకులను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ను తీసుకురావడంతో అప్రిలియా ఇండియా ఈ సూపర్ బైక్కు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. జాన్ అబ్రహంకు బైకులంటే చాలా ఇష్టం. అతడు ఎన్నో సూపర్ బైకులను కూడా కలెక్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ లిస్ట్లో అప్రిలియా RSV4 కూడా చేరింది.
ఆప్రిలియా ఇండియా మూడు సూపర్ బైక్లు 2024 RSV4, RS660, Tuono 660 ఇప్పటికే భారత్ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త సూపర్ బైక్ను విడుదల చేసింది. కొత్త టువరెగ్ 660 ఎడివి భారత మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త బైక్ను విడుదల చేయడంతో అప్రిలియా దేశంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. ఈ కొత్త వేరియంట్లో రైడర్లకు మంచి డ్రైవింగ్ ఫీల్ ఇస్తుంది. ఈ బైక్లన్నీ కంప్లీట్ బిల్ట్ అప్ యూనిట్లలో CBU అందుబాటులో ఉన్నాయి. బైక్లను దేశంలోని ఏప్రిలియా మోటోప్లెక్స్ డీలర్షిప్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
జాన్ అబ్రహంను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం అదృష్టమని అప్రిలియా ఇండియా చెబుతోంది. అప్రిలియాకు హృదయపూర్వకంగా అభిమానించే వ్యక్తిని తమ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నామని అన్నారు. సూపర్ బైకుల పట్ల అబ్రహంకు ఉన్న క్రేజ్ కంపెనీకి సరిపోతుందని అప్రిలియా చెప్పింది. జాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదని.. అతను అప్రిలియాకు నిజమైన అభిమాని అని, అప్రిలియా ఇష్టాన్ని ప్రతిబింబించే రైడర్ అని సూపర్ బైక్ తయారీ కంపెనీ చెబుతోంది.
Also Read : ట్రయంఫ్ టైగర్ నుంచి రూ. 16 లక్షల బైక్.. ఒక్కసారి ఎక్కితే ఉంటది మామ!
మీరు పూర్తి అడ్వెంచర్ ప్రేమికులైతే.. ఈ బైక్ను తిరస్కరించలేరు. ఈ బైక్తో అన్ని రకాల రోడ్లపై సులభంగా ప్రయాణం చేయవచ్చు. కంపెనీ ప్రకారం హిల్స్పై కూడా ఈ బైక్ను ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయవచ్చు. టువరెగ్ 660 అడ్వెంచర్ రైడర్లకు బెస్ట్ ఆఫ్షన్.