BigTV English
Advertisement

Atm transactions: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏటీఎం చార్జీల్లో మోత

Atm transactions: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏటీఎం చార్జీల్లో మోత

బ్యాంకులకు ఏటీఎంల నిర్వహణ భారంగా మారిన తర్వాత కస్టమర్లకు చుక్కలు చూపెడుతున్నాయి. సర్వీస్ చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ లు తమ సొంత కస్టమర్లకు కూడా అపరిమిత ఏటీఎం సేవలను అందించడంలేదు. పరిమితి దాటితే కచ్చితంగా ప్రతి లావాదేవీకి రుసుము చెల్లించాల్సిందే. ఇక ఒక బ్యాంక్ ఖాతాదారుడు ఇంకో బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు తీసుకునే విధానానికి కూడా పరిమితి ఉంది. ఆ పరిమితి దాటితే భారీగా రుసుములు వసూలు చేస్తాయి బ్యాంక్ లు. వీటిని ఏటీఎం ఇంచర్ ఛేంజ్ ఫీజులు అంటారు. ఈ రుసుములను తాజాగా ఆర్బీఐ సవరించింది. కొత్త బాదుడు మే-1 నుంచి అమలులోకి వస్తుంది.


ఉదాహరణకు యూనియన్ బ్యాంక్ లో ఖాతా ఉంది. కానీ మీకు అందుబాటులో ఆ బ్యాంక్ ఏటీఎం లేదు. డబ్బు అత్యవసరం అయినప్పుడు మీరు ఏం చేస్తారు..? దగ్గర్లో ఉన్న మరో బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసుకుంటారు. ఇలా క్యాష్ విత్ డ్రా చేసుకోవడానికి కూడా పరిమితి ఉంది. నగరాల్లో అయితే నెలకు 5సార్లు, మిగతా ప్రాంతాల్లో నెలకు కేవలం 3 సార్లు మాత్రమే ఉచితంగా క్యాష్ విత్ డ్రా చేసుకునే వీలుంది. అంతకు మించి చేసే ట్రాన్సాక్షన్లన్నిటికీ బ్యాంక్ లు చార్జీలు వసూలు చేస్తాయి. అంటే తమ ఏటీఎంని వినియోగించుకున్నందుకు యూనియన్ బ్యాంక్ వద్ద ఏస్బీఐ చార్జీలు వసూలు చేస్తుందనమాట. అయితే యూనియన్ బ్యాంక్ ఆ చార్జీని తన కస్టమర్ కి బదిలీ చేస్తుంది. వాస్తవంగా ట్రాన్సాక్షన్ చార్జీలు బ్యాంక్ చెల్లించాలి. కానీ ఆ బ్యాంక్ కస్టమర్ చెల్లించే విధంగా నిబంధనలు అమలు చేస్తోంది.

క్యాష్ విత్ డ్రా చేసేందుకు ఇతర బ్యాంక్ ల ఏటీఎంలను పరిమితికి మించి వాడితే ఇప్పటి వరకు ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ.17 రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడది రూ.19కి పెరిగింది. బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్ మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఇప్పటి వరకు రూ.6 వసూలు చేస్తుంటగా.. మే-1 తర్వాత దాన్ని రూ.7కి పెంచబోతున్నారు. ఈమేరకు ఇంటర్ ఛేంజ్ ఫీజులను పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.


నష్టపోయేది ఎవరు..?
వాస్తవానికి ఇంటర్ ఛేంజ్ ఫీజులు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వసూలు చేస్తాయి. ఈ ఫీజుల వల్ల అధికంగా ఏటీఎం సెంటర్లు నిర్వహించే బ్యాంక్ లకు ఎక్కువ లాభం చేకూరుతుంది. తక్కువ ఏటీఎంలు ఉండే చిన్న బ్యాంక్ లు, పెద్ద బ్యాంక్ లకు పెద్ద మొత్తంలో ఇంటర్ ఛేంజ్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ లు ఆ ఫీజులను కస్టమర్లపై నెట్టేస్తున్నాయి. మన బ్యాంక్ ఏటీఎం అందుబాటులో లేకపోతే ఇతర బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేస్తే ఆ భారం కస్టమర్లపైనే పడుతుంది. మే-1 నుంచి వారిపై మరింత భారం పడే అవకాశముంది.

బ్యాంక్ ల నిర్ణయంపై..
ఇంటర్ ఛేంజ్ చార్జీలను ఆర్బీఐ పెంచింది. అయితే వాటిని కస్టమర్లకు బదలాయించే విషయంలో మాత్రం ఆర్బీఐ మార్గదర్శకాలేవీ జారీ చేయలేదు. అంటే ఆయా బ్యాంక్ లు దీనికి తగినట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఏ బ్యాంక్ కూడా ఇంటర్ చేంజ్ చార్జీల రూపంలో నష్టపోవడానికి ఇష్టపడదు. అందుకే వాటిని తమ కస్టమర్లకు బదలాయిస్తుంది.

చిన్న బ్యాంక్ ల కస్టమర్లు లబోదిబో..
ఈ ఇంటర్ చేంజ్ చార్జీలు పెంచడం వల్ల చిన్న బ్యాంక్ ల కస్టమర్లు ఎక్కువగా నష్టపోతారు. ఆయా బ్యాంక్ లకు సంబంధించిన ఏటీఎంలు అందుబాటులో లేకపోతే కచ్చితంగా వారు ఇతర బ్యాంక్ ల ఏటీఎంలను ఆశ్రయించాల్సి వస్తుంది. అప్పుడు వారిపై మరింత భారం పడుతుంది.

Related News

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Big Stories

×