E-Paper
Advertisement

Secunderabad Railway Station: సికింద్రాబాద్ స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Secunderabad Railway Station: సికింద్రాబాద్ స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!
Advertisement

Secunderabad Railway Station Foot Over Bridge:

సౌత్ ఇండియాలో అతి పెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రోజూ వేలాది మంది ప్రయాణీకులతో బిజీగా ఉంటుంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను పునర్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా అద్భుతంగా నిర్మిస్తోంది. సుమారు రూ.750 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్ పోర్టు మాదిరి సౌకర్యాలతో కళ్లు చెదిరేలా రూపుదిద్దుకుంటుంది.  నిర్మిస్తోంది. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మల్టీ లెవెల్ పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా సహా కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయిస్తున్నారు.

అందుబాటులోకి కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తాజాగా కొత్త కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఇది ప్లాట్ ఫారమ్ 1 నుంచి ప్లాట్ ఫారమ్ 10 వరకు అన్నింటినీ అనుసంధానిస్తుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదికి చేరుకున్న ప్రయాణీకులు ఏ ప్లాట్ ఫారమ్ మీదికైనా ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది. పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో ప్రయాణీకులకు రద్దీ పెరిగింది. నిర్మాణ పనుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు మెయిన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారు. పండుగ సీజన్‌ లో ఇంటర్ ప్లాట్‌ ఫామ్ కనెక్టివిటీని మెరుగుపరచనుంది. క్రౌడ్ కంట్రోల్ కు ఉపయోగపడనుంది. అందుబాటులోకి వచ్చిన  ఈ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రయాణికులకు ఎంతో ఊరట కలిగించనుంది. ఇప్పటి వరకు స్టేషన్ లో తక్కువ సంఖ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు ఉండటంతో ఇబ్బందులు కలిగేవి. కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ ఫార్మ్‌ లను అనుసంధానిస్తూ, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ లు, ర్యాంపులు సహా ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలకు బాగా ఉపయోగపడనుంది.

Advertisement

పార్కింగ్ కోసం  కీలక ఏర్పాట్లు

ఇక రైల్వే స్టేషన్ లో పార్కింగ్ కోసం అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. పార్కింగ్ ఇబ్బంది లేకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు. స్టేషన్‌కి వచ్చే ప్రయాణికులు వాహనాలను నిలిపేందుకు స్థలం లేక ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదురయ్యేది. ఈ నేపథ్యంలోనే 4 నుంచి 5 అంతస్తుల పార్కింగ్ సౌకర్యం కలిగిన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, వాహనాలను ఈజీగా పార్క్ చేసే అవకాశం ఉంటుంది. ట్రాపిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ లో  బస్సులు, ఆటోలు, ప్రయాణికులు.. అంతా ఒకే చోట కలవడం వల్ల ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక లేన్లు, పికప్ డ్రాప్ జోన్లు, విశ్రాంతి ప్రాంతాలు, సిమెంట్ రోడ్లు, గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ఈ రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టు మాదిరిగా రూపొందనుంది.

Advertisement

Read Also: నదీ గర్భంలో 33 మీటర్ల లోతులో.. చిరుతలా దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×