Credit Card Closing: సతీష్ ఓ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. కొన్నాళ్లకు తనకు క్రెడిట్ కార్డు అవసరంలేదని భావించి క్లోజ్ చేయాలని బ్యాంకును కోరాడు. అయితే కార్డు ఇచ్చేటప్పుడు ఫ్రీ కార్డు, ఛార్జీలు పడవని చెప్పిన బ్యాంక్.. క్లోజింగ్ సమయంలో రూ.1500 ఛార్జీల రూపంలో ఖాతాలో అమౌంట్ కట్ చేసింది. ఛార్జీలంటూ క్రెడిట్ కార్డు సిబ్బంది తెలివిగా తప్పించుకున్నారు. బ్యాంకులు క్రెడిట్ కార్డులపై వసూలు చేసే ఇలాంటి అదనపు ఛార్జీలకు ఆర్బీఐ చెక్ పెట్టింది. అది ఎలానో తెలుసుకుందాం.
సతీష్ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయమని చెప్పినప్పుడు బ్యాంక్ వాళ్లు సరే అని చెప్పి… ప్రాసెస్ పూర్తి అయ్యేందుకు 3 నెలల టైం పడుతుందని చెప్పారు. అనేకసార్లు కాల్స్, ఫాలో అప్స్ తర్వాత చివరికి క్రెడిట్ కార్డు క్లోజ్ చేశారు. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ కు బ్యాంక్ సిబ్బంది సైలెంట్ గా రూ.1,500 వార్షిక ఫీజు వసూలు చేసింది. పైగా వాటిపై మళ్లీ ఛార్జీలు కూడా వసూలు చేసింది. చాలా ఏళ్లుగా బ్యాంకులు ఈ ట్రిక్ ఉపయోగిస్తు్న్నాయి. క్రెడిట్ కార్డు క్లోజింగ్ ను ఆలస్యం చేయడం, అందుకు ఛార్జీలు వసూలు చేయడం అలవాటుగా మారింది.
ఈ తరహా ఘటనలకు ఆర్బీఐ చెక్ పెట్టింది. నిబంధనలను మార్పు చేసి కస్టమర్ చేతికి మూడు శక్తివంతమైన నిబంధనలను ఇచ్చింది. కస్టమర్ అభ్యర్థన మేరకు క్రెడిట్ కార్డును 7 రోజుల్లోపు క్లోజ్ చేయాలి. 7 రోజుల్లో కార్డు క్లోజ్ చేయకపోతే.. ఆ పైన ప్రతి రోజుకు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల ఆలస్యానికి కస్టమర్ కు రూ. 15,000 పరిహారం చెల్లించాలి.
గతంలో, బ్యాంకులు కస్టమర్ కొనుగోళ్లను EMIలుగా మార్చేసేవి. ఇప్పుడు కస్టమర్ కు తెలియకుండా ఆటో ఈఎంఐగా మార్చడం చట్టవిరుద్ధం. కస్టమర్ రాత పూర్వక అనుమతి లేకుండా బ్యాంకులు ఈఎంఐలోకి మార్చడానికి వీలులేదు. ఏదైనా మోసం జరిగి కార్డులో అమౌంట్ కట్ అయితే, ఆ మోసాన్ని 3 రోజుల్లోపు బ్యాంకుకు రిపోర్టు చేయాలి. ఇలా చేస్తే ఆ మోసానికి కస్టమర్ ఎలా బాధ్యత వహించనక్కర్లేదు. రూపాయి కూడా చెల్లించవలసిన అవసరంలేదు.
Also Read: ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా? క్రెడిట్ కార్డులతో కిరాణా బిల్లులను తగ్గించుకోండిలా..
క్రెడిట్ కార్డు క్లోజింగ్ లో కస్టమర్ చేయాల్సిందల్లా ఈ-మెయిల్ ద్వారా కార్డు క్లోజర్ ను ఫాలో అప్ చేయాలి. రిఫరెన్స్ నంబర్లను సేవ్ చేయడం, 7 రోజుల గడువును ట్రాక్ చేయడం, ఆలస్యమైతే జరిమానా గురించి తెలియజేయాలి.