E-Paper
Advertisement

Cyber crime: కొత్త తరహా మోసం.. స్విగ్గీ అకౌంట్‌తో ₹97వేలు చోరీ..

Cyber crime: కొత్త తరహా మోసం.. స్విగ్గీ అకౌంట్‌తో ₹97వేలు చోరీ..
Advertisement

Cyber crime: ఆన్‌లైన్‌ డెలివరీలు యాప్‌లు వినియోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అలా ఓ మహిళ స్విగ్గీ అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.97 వేలు దోచుకున్నారు. పెద్ద ఎత్తున ఆపర్లు ఇస్తాం.. లక్కీ డ్రా వచ్చింది బహుమతులు తీసుకెళ్లండి అంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు నేరస్తులు.

అయితే ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు నేరగాళ్లు. ఆన్ లైన్ డెలివరీ యాప్ లు వినియోగిస్తున్న వారే లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెరలేపారు నేరస్తులు. మీ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ నమ్మించి మోసం చేస్తున్నారు నేరగాళ్లు. అలాంటి దారులకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్థులను పట్టుకొని అరెస్టు చేశారు పోలీసులు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐవీఆర్ (Interactive Voice Response)అనే సాంకేతిక సాయంతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు కాల్ చేశారు. స్విగ్గీ అధికారులమనీ, మీ ఖాతా హ్యాక్ అయ్యిందని మాయమాటలు చెప్తున్నట్లు వెల్లడించారు. అకౌంట్‌ను యాక్సెస్‌ చేయడానికి అపరిచితులు ప్రయత్నిస్తున్నారని నేరస్తులు ఆ మహిళను నమ్మించినట్లు తెలిపారు.

ఖాతాను రక్షించడానికి మరికొంత సమాచారం తెలపాల్సి ఉంటుందన్నారన్నారు. నిజంగానే తన అకౌంట్‌ ప్రమాదంలో పడిందేమోనని నమ్మిన మహిళ వెంటనే తన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ వంటి వ్యక్తిగత వివరాలు వారికి తెలిపిందని వెల్లడించారు. అంతే తన ఖాతా నుంచి రూ.97వేలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు.

Advertisement

డబ్బులు తన అకౌంట్ నుంచి పోయిన విషయం తెలుసుకున్నబాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాది చేసింది. స్విగ్గీ అకౌంట్‌కు లింక్‌ చేసిన అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని తెలిపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురుగ్రామ్‌కు చెందిన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) దోషులుగా గుర్తించి తక్షణమే అరెస్టు చేశారు. వీరిలో కల్రా అనే వ్యక్తి ఇంతకుముందు స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేశాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కిరాణా వస్తువుల్ని తక్కువ ధరలకు కొని లాభం కోసం తిరిగి విక్రయించేవాడని తెలిసింది. ఇలా ఆన్‌లైన్‌ ఆర్డర్లు చేసేవారి సమాచారం సేకరించి హిమాన్షుతో కలిసి డబ్బుల్ని దోచుకుంటున్నారనే విషయం పోలీసుల విచారణ లో బయటపడింది.

Tags

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×