Davos 2026: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సు సందర్భంగా 24 దేశాలకు చెందిన సుమారు 400 మంది మిలియనీర్లు, బిలియనీర్లు అంతర్జాతీయ నాయకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. అతి సంపన్నులపై పన్నులు పెంచండని వారు డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అపరిమితమైన సంపద రాజకీయాలను కలుషితం చేస్తోందని, కొద్దిమంది బిలియనీర్లు ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రభుత్వాలను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులకు, సామాన్యులకు మధ్య పెరుగుతున్న ఈ ఆర్థిక వ్యత్యాసం సామాజిక బహిష్కరణకు, వాతావరణ అత్యవసర పరిస్థితికి (Climate Emergency) దారితీస్తోందని పేర్కొన్నారు.
హాలీవుడ్ నటుడు మార్క్ రుఫెలో, సంగీత విద్వాంసుడు బ్రియాన్ ఎనో, డిస్నీ వారసురాలు అబిగైల్ డిస్నీ వంటి ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు. “ఒక చేతివేళ్లపై లెక్కించదగ్గ వ్యక్తుల దగ్గర సంపద కేంద్రీకృతమవ్వడం వల్ల పేదరికం పెరుగుతోంది. మాపై పన్నులు విధించి, ఆ సంపదను ప్రజల ప్రయోజనాల కోసం వాడండి.” అని వారు కోరారు.
ఈ లేఖతో పాటు ఆక్స్ఫామ్ విడుదల చేసిన నివేదిక కొన్ని విస్తుపోయే నిజాలను వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బిలియనీర్ల సంఖ్య 3,000 మార్కును దాటింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 1 శాతం మంది దగ్గర ఉన్న సంపద, మిగిలిన ప్రపంచవ్యాప్త ప్రభుత్వాల దగ్గర ఉన్న మొత్తం సంపద కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అక్టోబర్ 2025లో ఎలన్ మస్క్ అర ట్రిలియన్ డాలర్ల ($500 billion) సంపదను దాటిన తొలి వ్యక్తిగా నిలిచారు.
Read Also: ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్.. ఒకేసారి 17 ట్రక్కులు లాంచ్ చేసిన టాటా మోటార్స్