SEBI Warning: నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు అనేక మందికి కీలకమైన సమాచార వేదికగా మారాయి. కానీ, ఈ వేదికలు, కొన్ని సందర్భాల్లో, మోసపూరిత కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అర్హత లేని అనేక మంది యూట్యూబ్ లేదా వాట్సాప్ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి సూచనలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇకపై అలా చేసే వారిపై చర్యలు తప్పవని సెబీ హెచ్చరించింది. తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇలా చేసే వారికి హెచ్చరికలను జారీ చేసింది.
పెరుగుతున్న పెట్టుబడుల మోసాలు
సెబీ ప్రకటన ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వినియోగం మరింత పెరిగినప్పటికీ, పలువురు వీటిని తప్పుడు సమాచార వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ (ఇప్పుడే ఎక్స్), వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ వంటి ప్రసిద్ధ వేదికలపై అనేక మోసపూరిత ట్రేడింగ్ కాంటెంట్ అభ్యర్థనలు పెరుగుతున్నాయి. అనేక సంస్థలు ట్రేడింగ్, పెట్టుబడి లేదా కాప్ స్టాక్ మార్కెట్ రాబడిపై హామీలు ఇచ్చి, అమాయక పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఆ క్రమంలో తప్పుడు ట్రేడింగ్ కాల్స్ ఇచ్చి, పెట్టుబడి దారులను మోసం చేస్తున్నారు.
Read Also: Samsung Ballie: బాలి వచ్చాడు..ఇంట్లోనే ఫ్యూచర్ టచ్, కొత్త …
మోసపూరిత ట్రేడింగ్ కాల్స్, హామీలు
ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా “అత్యధిక రాబడులు”, “రిస్క్-రహిత పెట్టుబడులు” లేదా “డిస్కౌంట్ ధరలకు IPOలు” అనే ప్రకటనలు చూసినట్లైతే, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెబీ తెలిపింది. ఈ తరహా ప్రకటనలు సోషల్ మీడియాలో పెరుగుతున్నాయని గుర్తు చేసింది. మోసగాళ్ళు, సోషల్ మీడియాలో పెట్టుబడిదారులని ఆకర్షించి, వారు ఇచ్చే ట్రేడింగ్ సేవల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారని తెలిపింది. అవి వాస్తవానికి నిజంగా గుర్తింపు పొందిన సంస్థలు కాదని తెలిపింది. ఇలాంటి అనేక ప్రకటనలు మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా వస్తున్నాయని స్పష్టం చేసింది. ఇవి SEBI ద్వారా నమోదు చేయబడని సంస్థలని, తప్పుడు సర్టిఫికెట్లు చూపించి మోసం చేస్తున్నారని వెల్లడించింది.
రిజిస్టర్డ్ సంస్థలను మాత్రమే
ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు, తమ పెట్టుబడులు పెట్టే ముందు, సెబీ రిజిస్టర్డ్ అయిన సంస్థల ద్వారా మాత్రమే సేవలు పొందాలని సెబీ సూచించింది. అనధికార ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు, ఇతర మొబైల్ యాప్స్ ద్వారా ట్రేడింగ్ చేయటం ప్రమాదకరమని వెల్లడించింది. పెట్టుబడిదారులు సెబీ రిజిస్టర్ చేయబడిన ట్రేడింగ్ ఏజెంట్స్, బ్రోకర్స్, అథారైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్, ట్రేడింగ్ యాప్ల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని కోరింది. జాగ్రత్తగా చూసుకోకపోతే, మోసపూరిత పద్ధతులలో, మీరు మీ విలువైన డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందని మరోసారి హెచ్చరించింది.
తప్పుదారి పట్టించే వాస్తవాలు
మోసగాళ్ళు వారి వెబ్సైట్లను, యాప్లను సక్రమంగా రూపొందించి, ట్రేడింగ్ సలహాలు ఇస్తున్నారు. కానీ వారు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలు, కేవలం హామీ ఇచ్చే కంటెంట్ లేదా రాబడుల హామీలను రూపొందిస్తారు. అవి పూర్తిగా తప్పని సెబీ తెలిపింది. మోసపూరిత సేవలు ఇచ్చే ఈ యాప్లు, బ్రోకర్గా, సెబీ రిజిస్టర్ చేసిన సంస్థగా, చూపించుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయని తెలిపింది.
ప్రైవేట్ చాట్లు, గ్రూపుల మోసాలు
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు మాత్రమే కాదు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రైవేట్ చాట్ లేదా గ్రూపుల ద్వారా కూడా మోసాలు జరగుతున్నాయి. టెక్స్ట్ మెసేజ్లు, ఆడియో సందేశాలు, వీడియోల ద్వారా కంటెంట్ గ్రూపులలో చేరడం కోసం చేరటానికి ప్రేరేపిస్తున్నారు. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సెబీ సూచించింది.