EPFO UPI Withdraw: ఈపీఎఫ్ఓ యూపీఐ విత్ డ్రాపై ఉద్యోగస్తులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కొత్త మొబైల్ యాప్ ను ప్రారంభించనుంది. కొత్త యాప్ ద్వారా 8 కోట్ల ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ యూపీఐ ద్వారా నేరుగా విత్ డ్రా చేసుకోవచ్చు. తమ పీఎఫ్ ఖాతాలోని కొంత భాగం మినహా.. మిగిలిన మొత్తాన్ని UPI ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ అధికార వర్గాలు తెలిపాయి. EPFO 3.0 అప్గ్రేడ్లో భాగంగా ఈ కొత్త విత్ డ్రా ప్రక్రియను.. పేపర్ లెస్, పూర్తిగా డిజిటల్ మార్గంలో అమలు చేయనున్నారు.
ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రస్తుతం విత్ డ్రా క్లెయిమ్ల కోసం ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. కొత్తగా రానున్న ఆటో సెటిల్మెంట్ మోడ్ లో 3 రోజుల్లోపు క్లెయిమ్లను పరిష్కరించనున్నారు. ఈ ఆటో సెటిల్మెంట్ మోడ్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచనున్నారు. ఈ విధానం వల్ల ఈపీఎఫ్ఓపై భారం తగ్గనుంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఏటా 5 కోట్లకు పైగా క్లెయిమ్లను పరిష్కరిస్తుంది. వీటిల్లో ఎక్కువగా పీఎఫ్ విత్ డ్రాలకు సంబంధించినవే. బ్యాంకులతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also Read: యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్డ్రా.. ఇంత నగదు మాత్రమే తీసుకోగలరట!