E-Paper
Advertisement

Gold Rate Today: అయ్య బాబోయ్.. తులం బంగారం లక్ష రూపాయలు

Gold Rate Today: అయ్య బాబోయ్.. తులం బంగారం లక్ష రూపాయలు
Advertisement

Gold Rate Today: ఏంటీ.. తులం బంగారం రూ.లక్షా.. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా.? అవును అతి త్వరలోనే పసిడి ధర అక్షరాల రూ.లక్ష చేరుకుంటుందని మార్కెట్ల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు భారీగా బంగారం పెరగటానికి కారణాలు ఏంటి?

మధ్య ప్రాశ్చంలో పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలోనే  పసిడి ధరలు పెరుగుతున్నాయని బిలియన్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా క్రూడ్ ఆయిల్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. పిరిస్థితి ఇంకా కొనసాగితే ఇండియా, చైనా ఇతర దేశాల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లు కుంటుపడే అవకాశం కనిపిస్తుంది. దీని ఫలితంగా స్టాక్ మార్కెట్లు సైతం అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తలో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఇక భవిష్యత్తులో బంగారం(Gold) కొనాలంటే.. అంబానీ అయ్యిండాలేమో అనేలా కనిపిస్తోంది. 2004 లో పసిడి ధర(Gold Rate) 6, 300 ఉండేది. కానీ ఇప్పుడు 79 వేలకు చేరింది. ప్రపంచంలో ఎన్ని సంక్షోభాలు వచ్చిన బంగారంలోన పెట్టుబడులు పెట్టేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక రానున్నది దీపావళి పండుగ. అందులోను కార్తీక మాసం, పూజలు, వ్రతాలు చేస్తూ మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. దీంతో పాటు వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకేముంది పసిడి ధరలు కొండెక్కి కూర్చుంటాయి.

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Advertisement

బడ్జెట్ పుణ్యమా అని మధ్యలో తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు మళ్లీ పుంజుకోవడం, దేశీయంగా పండగ గిరాకీ పెరగడమే ఇందుకు కారణం అని బిలియన్ మార్కెట్లు చెబుతున్నాయి. దీపావళి పర్వదినం(deepavali) సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా కొనుగోలు జరుగుతాయి. ధంతేరస్ రోజు బంగారం ఖచ్చితంగా కొనుగోలు చెయ్యాలనే సాంప్రదాయం గత కొన్నాళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో బంగారానికి(Gold) ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ధరలు భారీగా పెరగడం కొనుగోలుపై ప్రతికూల ప్రభావం చూపించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనేందుకు ప్రజలు మొగ్గుచూపిన పరిమితంగా ఉండొచ్చు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

తెలంగాణలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర((Gold Rate) రూ. 73,000 ఉంది.

విజయవాడలో కూడా 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate)  రూ.79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 790 తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73, 150 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 పెరిగింది.

 

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×