E-Paper
Advertisement

Gold Rate Today: అయ్య బాబోయ్.. తులం బంగారం లక్ష రూపాయలు

Gold Rate Today: అయ్య బాబోయ్.. తులం బంగారం లక్ష రూపాయలు

Gold Rate Today: ఏంటీ.. తులం బంగారం రూ.లక్షా.. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా.? అవును అతి త్వరలోనే పసిడి ధర అక్షరాల రూ.లక్ష చేరుకుంటుందని మార్కెట్ల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలు భారీగా బంగారం పెరగటానికి కారణాలు ఏంటి?

మధ్య ప్రాశ్చంలో పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలోనే  పసిడి ధరలు పెరుగుతున్నాయని బిలియన్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా క్రూడ్ ఆయిల్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. పిరిస్థితి ఇంకా కొనసాగితే ఇండియా, చైనా ఇతర దేశాల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లు కుంటుపడే అవకాశం కనిపిస్తుంది. దీని ఫలితంగా స్టాక్ మార్కెట్లు సైతం అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తలో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక భవిష్యత్తులో బంగారం(Gold) కొనాలంటే.. అంబానీ అయ్యిండాలేమో అనేలా కనిపిస్తోంది. 2004 లో పసిడి ధర(Gold Rate) 6, 300 ఉండేది. కానీ ఇప్పుడు 79 వేలకు చేరింది. ప్రపంచంలో ఎన్ని సంక్షోభాలు వచ్చిన బంగారంలోన పెట్టుబడులు పెట్టేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక రానున్నది దీపావళి పండుగ. అందులోను కార్తీక మాసం, పూజలు, వ్రతాలు చేస్తూ మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. దీంతో పాటు వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకేముంది పసిడి ధరలు కొండెక్కి కూర్చుంటాయి.

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

బడ్జెట్ పుణ్యమా అని మధ్యలో తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు మళ్లీ పుంజుకోవడం, దేశీయంగా పండగ గిరాకీ పెరగడమే ఇందుకు కారణం అని బిలియన్ మార్కెట్లు చెబుతున్నాయి. దీపావళి పర్వదినం(deepavali) సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా కొనుగోలు జరుగుతాయి. ధంతేరస్ రోజు బంగారం ఖచ్చితంగా కొనుగోలు చెయ్యాలనే సాంప్రదాయం గత కొన్నాళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో బంగారానికి(Gold) ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ధరలు భారీగా పెరగడం కొనుగోలుపై ప్రతికూల ప్రభావం చూపించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనేందుకు ప్రజలు మొగ్గుచూపిన పరిమితంగా ఉండొచ్చు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

తెలంగాణలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర((Gold Rate) రూ. 73,000 ఉంది.

విజయవాడలో కూడా 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate)  రూ.79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 790 తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73, 150 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ.79, 640 కు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర(Gold Rate) రూ. 73,000 పెరిగింది.

 

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×