E-Paper
Advertisement

Highest Daily Salary States: అత్యధిక రోజువారీ జీతం ఉన్న టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు స్టేట్స్ ప్లేస్ ఇదే

Highest Daily Salary States: అత్యధిక రోజువారీ జీతం ఉన్న టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు స్టేట్స్ ప్లేస్ ఇదే
Advertisement

Highest Daily Salary States: భారతదేశంలోని ఆర్థిక పరిస్థితులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రోజు వారీ వేతనాలపై ప్రభావం చూపుతున్నాయి. జాతీయ సగటు రోజువారీ జీతం రూ.1,077 వద్ద ఉంది. ప్రాంతీయ వ్యత్యాసాలు రాష్ట్రాల ఆదాయాలను ప్రభావితం చేస్తున్నాయి.

టాప్-10 రాష్ట్రాలు

2025లో దేశ రాజధాని దిల్లీ అత్యధిక సగటున రోజువారీ వేతనం రూ.1,346 కలిగి అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక రూ.1,269తో, మహారాష్ట్ర రూ.1,231తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రూ.1,192 రోజు వారీ జీతంతో తెలంగాణ నాల్గో స్థానంలో ఉండగా, రూ.1,154 జీతంతో హర్యానా ఐదో స్థానంలో ఉంది. రూ.1,115 జీతంతో తమిళనాడు ఆరో స్థానంలో, రూ.1,077 జీతంతో గుజరాత్ ఏడో స్థానంలో ఉంది.

Advertisement

రూ.1,038 జీతంతో ఉత్తరప్రదేశ్ ఎనిమిది స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రోజు వారీ వేతనం రూ.1,000తో తొమ్మిదో స్థానంలో, రూ.962 జీతంతో పంజాబ్ పది స్థానంలో నిలిచింది.

1. ఢిల్లీ: రూ. 1,346
2. కర్ణాటక: రూ. 1,269
3. మహారాష్ట్ర: రూ. 1,231
4. తెలంగాణ: రూ. 1,192
5. హర్యానా: రూ. 1,154
6. తమిళనాడు: రూ. 1,115
7. గుజరాత్: రూ. 1,077
8. ఉత్తర ప్రదేశ్: రూ. 1,038
9. ఆంధ్రప్రదేశ్: రూ. 1,000
10. పంజాబ్: రూ. 962

దిల్లీ అగ్రస్థానంలో

Advertisement

ప్రభుత్వ, ఐటీ, ఫైనాన్స్, కార్పొరేట్ రంగాలలో అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎక్కువగా దిల్లీలో ఉండడంతో.. అత్యధిక రోజువారీ వేతనం రూ.1,346తో అగ్రస్థానంలో నిలిచింది. కార్పొరేట్ సంస్థలకు కేంద్రమైన గుర్గావ్‌ దిల్లీకి సమీపంలో ఉంది.

భారతదేశ టెక్నాలజీ క్యాపిటల్ బెంగళూరు ఉన్న కర్ణాటక రోజు వారీ వేతనం రూ.1,269తో రెండో స్థానంలో ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, ఇంజినీరింగ్ పరిశ్రమలు కర్ణాటకలో వేతన స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మహారాష్ట్ర మూడో స్థానానికి.. ప్రధానంగా ముంబై ఆర్థిక, వినోదం, తయారీ రంగాలలో అత్యధిక జీతాలు కలిగి ఉండడం కారణమయ్యాయి.

Also Read: SBI UPI Down: యూపీఐ సేవల్లో అంతరాయం.. కస్టమర్లకు ఎస్బీఐ కీలక సూచన

తెలంగాణలో ఐటీ, ఫార్మా సంస్థలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఐటీ, ఫార్మా కంపెనీలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. హర్యానాలో పారిశ్రామిక, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు వేతనాల స్థాయిని పెంచుతున్నాయి. చెన్నైలో పారిశ్రామిక, ఆటోమోటివ్ క్లస్టర్‌లు ఉండడంతో తమిళనాడు కూడా వేతనాల్లో అగ్రస్థానంలో ఉంది. వీటికి తోడు ఐటీ రంగం అభివృద్ధి చెందుతుండడంతో ఆ రాష్ట్ర సగటు రోజువారీ జీతం పెరగడానికి దోహదపడుతుంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×