E-Paper
Advertisement

Indian billionaires: మండే మార్కెట్ ఎఫెక్ట్.. సంపద కోల్పోయిన భారత కుబేరులు

Indian billionaires: మండే మార్కెట్ ఎఫెక్ట్.. సంపద కోల్పోయిన భారత కుబేరులు
Advertisement

Indian billionaires: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ దేశంలో అన్ని రంగాలపై క్రమంగా పడుతోంది. స్టాక్ మార్కెట్ నేల చూపుల విషయం కాసేపు పక్కనబెడదాం. రేపటి రోజుల ఇంకా ఎలాంటి టారిఫ్ విధిస్తారోనన్న భయం బిజినెస్‌మేన్లను వెంటాడుతోంది. ట్రంప్ దెబ్బకు ఒక్కరోజులో నలుగురు భారతీయుల కుబేరుల సంపద 10.3 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ వెల్లడించింది.

కరిగిపోతున్న భారత్ కుబేరుల సంపద 

Advertisement

భారతీయుల సంపన్నుల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు. వారిలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ ఫ్యామిలీ, శివ్ నాడార్. సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి. దాని దెబ్బకు ఆయా వ్యాపారవేత్తల సంపద ఒక్క రోజు భారీగా తగ్గింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ స్వయంగా వెల్లడించింది. దాదాపు 10.3 బిలియన్ డాలర్లు సంపద క్షీణించినట్లు వెల్లడించింది.

ముకేశ్ అంబానీ

Advertisement

దేశంలో అత్యంత ధనికుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ఆయన సంపద విలువ ఒక్కరోజు 3.6 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ప్రస్తుతం ఆయన సంపద 87.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

గౌతమ్ అదానీ

ఇక అదానీ గ్రూప్‌ను నడుపుతున్న గౌతమ్ అదానీ సంపదలో 3 బిలియన్ల డాలర్ల తగ్గుదల స్పష్టంగా కనిపించింది. ఆయన నికర విలువ ఇప్పుడు 57.3 బిలియన్లు డాలర్లకు చేరింది.

ALSO READ: గుడ్ న్యూస్.. వెజ్, నాన్ వెజ్ ధరల తగ్గుదల

సావిత్రి జిందాల్

జిందాల్ గ్రూప్ యజమానులైన సావిత్రి జిందాల్ ఫ్యామిలీ 2.2 బిలియన్లు డాలర్లను కోల్పోయింది. ప్రస్తుతం వారి సంపద 33.9 బిలియన్లు పడిపోయింది. ప్రపంచ ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో ఉన్నారు ఆమె.

శివ్ నాడార్

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకురాలు శివ్ నాడార్ ఈ జాబితాలోకి చేరిపోయారు. సోమవారం ఒక్కరోజు ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లు నష్టాన్ని చవిచూసింది. దీంతో ఆయన సంపద విలువ ప్రస్తుతానికి 30.9 బిలయన్లు డాలర్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. దీంతో వ్యాపారవేత్తల సంపద ఆవిరైపోయింది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికాలో మాంద్యం భయాల కారణంగా పెట్టుబడిదారులు ఆలోచనలోపడ్డారు. సోమవారం రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 2,200 పాయింట్లు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 700 పాయింట్లు పైగానే కోల్పోయింది. సెన్సెక్స్ బోర్డులో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో అన్ని సూచీలకు సెగ తగిలింది.

అమెరికా కుబేరుల సంపద కూడా

ఇక ప్రపంచ కుబేరుల పరిస్థితికి వద్దాం. 2025లో వారెన్ బఫెట్ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగి 155 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలాన్ మస్క్ సంపద 130 బిలియన్ డాలర్లు తగ్గి 302 బిలియన్ డాలర్లకు పడిపోయింది. జెఫ్ బెజోస్ సంపద 45.2 బిలియన్ డాలర్లు తగ్గి 193 బిలియన డాలర్లకు చేరుకుంది.

మార్క్ జూకర్ బర్గ్ సంపద 28.1 బిలియన్ డాలర్లు తగ్గి 179 బిలియన్ డాలర్లు చేరింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 18.6 బిలియన్లు తగ్గి 158 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బిల్ గేట్స్ సంపద సైతం 3.38 బిలియన్ డాలర్లు క్షీణించింది. 155 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ తెలిపింది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×