Mumbai Emerged as Asia Billionaire Capital: భారత వాణిజ్య రాజధాని ముంబయి మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆసియా ఖండంలో బిలియనీర్ల కేంద్రంగా ముంబయి అవతరించింది. బీజింగ్ ను దాటి అత్యధిక మంది సంపన్నులు ఉన్న నగరంగా ముంబయి నిలిచింది.
హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక ప్రకారం ఆసియా ఖండంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న కేంద్రంగా ముంబయి అవరించింది. చైనా రాజధాని బీజింగ్ ను అధిగమించి తొలిసారిగా ముంబయి బిలియనీర్ క్యాపిటర్ గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాదికి గానూ ఎక్కువ మంది ధనమంతులు నివాముంటున్న నగరాల జాబితాను హూరున్ తాజాగా వెల్లడించింది. అందులో ఆసియాలో ముంబుయి మొదటి స్థానంలో నిలిచింది.
92 మంది బిలియనీర్లు ముంబయి నగరంలో ఉండడంతో ఇది మొదటి స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క బిలియనీర్ స్థానం తగ్గి 91 మంది బిలియనీర్లతో బీజింగ్ రెండో స్థానానికి పరిమితమైంది. గంతో బిజీంగ్ నగరమే ఆసియా ఖండంలో అత్యధిక శ్రీమంతులు ఉండే నగరంగా ఉండేది. కానీ ఈ ఏడాది ముంబయి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది కాలంలో ముంబయిలో 26 మంది కుబేరుల క్లబ్ లో చేరారు. అయితే బీజింగ్ మాత్రం దీనికి భిన్నంగా 18 మందిని ఈ జాబితా నుంచి కోల్పోయింది.
ముంబయి ప్రపంచంలోనే అత్యంత వేగంగా బిలియనీర్ క్యాపిటల్ నగరంగా ఎదిగిన నగరం అని హూరున్ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కుబేరులున్న నగరాల జాబితాలో ముంబయి మూడో స్థానంలో నిలిచినట్లు హూరున్ గ్లోబల్ రిచ్ నివేదిక తెలిపింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్ 119 మందితో మొదటి స్థానంలో ఉంది. 97 మందితో లండన్ రెండో స్థానంలో నిలిచింది. మన దేశ రాజధాని ఢిల్లీ ఈ నివేదిక ప్రకారం తొలిసారిగా టాప్-10లో చోటు సంపాదించింది.
Also Read: Hand Bags: గాలితో తయారైన హ్యాండ్ బ్యాగ్.. ప్రపంచంలోనే లైట్ వెయిట్ బ్యాగ్గా రికార్డ్
అయితే దేశాల వారిగా చూస్తే ఎక్కువ మంది బిలియనీర్లతో చైనానే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో చైనా 155 మంది కోటీశ్వరులు తమ సంపదను భారీగా కోల్పోయారు. అయినా సరే 814 మంది బిలియనీర్లతో చైనా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. చైనా తర్వాత స్థానంలో.. 800 మందితో అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ జాబితాలో 271 మందితో భారత్ మూడో స్థానంలో ఉంది. త్వరలోనే భారత్ లో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని హురున్ గ్లోబల్ రిచ్ అభిప్రాయపడింది.