E-Paper
Advertisement

Mumbai surpassing Beijing: బీజింగ్‌ను వెనక్కినెట్టిన ముంబయి.. ఆసియా కుబేరుల రాజధానిగా..

Mumbai surpassing Beijing: బీజింగ్‌ను వెనక్కినెట్టిన ముంబయి.. ఆసియా కుబేరుల రాజధానిగా..
Mumbai Emerged As Asia Billionaire capital
Mumbai Emerged As Asia Billionaire capital

Mumbai Emerged as Asia Billionaire Capital: భారత వాణిజ్య రాజధాని ముంబయి మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆసియా ఖండంలో బిలియనీర్ల కేంద్రంగా ముంబయి అవతరించింది. బీజింగ్ ను దాటి అత్యధిక మంది సంపన్నులు ఉన్న నగరంగా ముంబయి నిలిచింది.

హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక ప్రకారం ఆసియా ఖండంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న కేంద్రంగా ముంబయి అవరించింది. చైనా రాజధాని బీజింగ్ ను అధిగమించి తొలిసారిగా ముంబయి బిలియనీర్ క్యాపిటర్ గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాదికి గానూ ఎక్కువ మంది ధనమంతులు నివాముంటున్న నగరాల జాబితాను హూరున్ తాజాగా వెల్లడించింది. అందులో ఆసియాలో ముంబుయి మొదటి స్థానంలో నిలిచింది.

92 మంది బిలియనీర్లు ముంబయి నగరంలో ఉండడంతో ఇది మొదటి స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క బిలియనీర్ స్థానం తగ్గి 91 మంది బిలియనీర్లతో బీజింగ్ రెండో స్థానానికి పరిమితమైంది. గంతో బిజీంగ్ నగరమే ఆసియా ఖండంలో అత్యధిక శ్రీమంతులు ఉండే నగరంగా ఉండేది. కానీ ఈ ఏడాది ముంబయి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది కాలంలో ముంబయిలో 26 మంది కుబేరుల క్లబ్ లో చేరారు. అయితే బీజింగ్ మాత్రం దీనికి భిన్నంగా 18 మందిని ఈ జాబితా నుంచి కోల్పోయింది.

ముంబయి ప్రపంచంలోనే అత్యంత వేగంగా బిలియనీర్ క్యాపిటల్ నగరంగా ఎదిగిన నగరం అని హూరున్ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కుబేరులున్న నగరాల జాబితాలో ముంబయి మూడో స్థానంలో నిలిచినట్లు హూరున్ గ్లోబల్ రిచ్ నివేదిక తెలిపింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్ 119 మందితో మొదటి స్థానంలో ఉంది. 97 మందితో లండన్ రెండో స్థానంలో నిలిచింది. మన దేశ రాజధాని ఢిల్లీ ఈ నివేదిక ప్రకారం తొలిసారిగా టాప్-10లో చోటు సంపాదించింది.

Also Read: Hand Bags: గాలితో తయారైన హ్యాండ్ బ్యాగ్.. ప్రపంచంలోనే లైట్ వెయిట్ బ్యాగ్‌గా రికార్డ్

అయితే దేశాల వారిగా చూస్తే ఎక్కువ మంది బిలియనీర్లతో చైనానే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో చైనా 155 మంది కోటీశ్వరులు తమ సంపదను భారీగా కోల్పోయారు. అయినా సరే 814 మంది బిలియనీర్లతో చైనా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. చైనా తర్వాత స్థానంలో.. 800 మందితో అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ జాబితాలో 271 మందితో భారత్ మూడో స్థానంలో ఉంది. త్వరలోనే భారత్ లో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని హురున్ గ్లోబల్ రిచ్ అభిప్రాయపడింది.

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×