E-Paper
Advertisement

PM Kisan Yojana: ఏకంగా రూ. 416 కోట్లు తిరిగి వసూలు..పీఏం కిసాన్ యోజనలో కీలక నిర్ణయం

PM Kisan Yojana: ఏకంగా రూ. 416 కోట్లు తిరిగి వసూలు..పీఏం కిసాన్ యోజనలో కీలక నిర్ణయం
Advertisement

PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) యోజన భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతుల కోసం 2019లో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకం. దీని ద్వారా అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ స్కీం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో అనర్హులైన వారిని గుర్తించి నగదు రికవరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ. 416 కోట్లను తిరిగి వసూలు చేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కఠినమైన చర్యలు
ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా మద్దతు అందించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, కొన్ని అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సహా పలువురు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించడంతో, కేంద్రం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు కారో, ఎవరెవరి నుంచి డబ్బును తిరిగి వసూలు చేస్తున్నారనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

Advertisement

పీఎం కిసాన్ యోజన
కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుంది.
ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి కోట్లాది మంది రైతులు దీని ప్రయోజనాన్ని పొందారు. అయితే, ఇటీవల అనర్హులైన వ్యక్తులు కూడా ఈ పథకం కింద డబ్బును తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Read Also: Power Bank Offer: జీబ్రానిక్స్ పవర్ బ్యాంక్ డీల్ అదుర్స్..

Advertisement

ఎవరెవరు ఈ పథకానికి అర్హులు కారు?
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి, ఈ క్రింది వర్గాలకు చెందిన వారు పీఎం కిసాన్ యోజన కింద సహాయం పొందేందుకు అర్హులు కారని స్పష్టం చేసింది.

1. భూ యజమానులు
వ్యవసాయ భూమి కంపెనీలకు, సంస్థలకు లేదా ఇతర పెద్ద సమూహాలకు చెందినవారికి ఈ పథకం వర్తించదు.

2. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు
తమ ఆదాయంపై ట్యాక్స్ కట్టే రైతులు లేదా ఇతర వ్యక్తులు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందలేరు.

3. ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లు
కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల ఉద్యోగులు (గ్రూప్ D/కేటగిరీ IV ఉద్యోగులు మినహా). నెలకు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే పెన్షనర్లు.

4. రాజ్యాంగ పదవులు నిర్వహించినవారు
ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్మన్లు ఈ పథకానికి అర్హులు కాదు

5. ఇతర వృత్తిపరమైన వ్యక్తులు
వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి నిపుణులు. తమ వృత్తిని కొనసాగిస్తున్నవారికి ఈ పథకం ప్రయోజనం అందదు.

అనర్హులైన రైతుల నుంచి డబ్బు ఎలా వసూలు చేస్తున్నారు?
ప్రభుత్వం డిజిటల్ డేటా విశ్లేషణ, ఆధార్ లింకింగ్, e-KYC విధానాల ద్వారా అనర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తోంది. రైతుల భూమి వివరాలను ప్రభుత్వ డేటాబేస్‌తో క్రాస్-చెక్ చేస్తోంది. నకిలీ ఖాతాలకు డబ్బు వెళ్లకుండా నియంత్రించేందుకు కఠినమైన విధానాలు అమలులోకి వచ్చాయి.  అన్నిరకాల ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు, రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ.416 కోట్లను తిరిగి రికవరీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మిగతా అర్హత లేని రైతుల నుంచి కూడా డబ్బును వసూలు చేయనుంది.

తప్పుగా పొందిన రైతులు డబ్బు ఎలా తిరిగి చెల్లించాలి?
తాము పొరపాటున లేదా తెలియకుండానే ఈ పథకం కింద డబ్బు తీసుకున్నామని భావించే రైతులు, స్వయంగా డబ్బును తిరిగి చెల్లించేందుకు క్రింది ఎంపికలు ఉన్నాయి.

PM-Kisan అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
-Refund Online అనే విభాగంలోకి వెళ్లి, తమ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసి, డబ్బును తిరిగి పంపించాలి.
-లేదా సంబంధిత రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రభుత్వ చర్యలు & భవిష్యత్తు మార్పులు
ఇకపై అర్హులైన రైతులు మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకునేలా మరింత కఠినమైన ఆడిట్‌లు, వెరిఫికేషన్ విధానాలు అమలులోకి రాబోతున్నాయి. తప్పుగా డబ్బు పొందిన రైతులు త్వరగా తిరిగి చెల్లించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిజిటల్ వ్యవసాయ డేటాబేస్ ద్వారా, అర్హులైన రైతులను మాత్రమే పథకంలో చేర్చే విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నారు.

Tags

Related News

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

Big Stories

Advertisement
×