BigTV English

Investment Plan: SBIలో అదిరిపోయే గ్రోత్ ప్లాన్.. పెట్టిన మొత్తంపై మూడు రెట్ల లాభం

Investment Plan: SBIలో అదిరిపోయే గ్రోత్ ప్లాన్.. పెట్టిన మొత్తంపై మూడు రెట్ల లాభం

Investment Plan: ప్రస్తుతం దేశంలోని అనేక మంది ప్రజల్లో పెట్టుబడులు చేసే ధోరణి మారిపోయింది. సాధారణ FDలతో పోలిస్తే, కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు కానీ, అధిక రిటర్న్స్ వచ్చేవి కావాలని అంటున్నారు. ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి SBI PSU డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. SBI PSU డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనేది మ్యూచువల్ ఫండ్ ఆప్షన్. ఈ ఫండ్ ఉద్దేశం ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీల (PSUs) స్టాక్స్‌లో పెట్టుబడులు చేయడం.


ప్రాఫిటబుల్‌ ఫండ్..

ఈ ప్లాన్ మ్యూచువల్ ఫండ్ వృద్ధి పథకం కావడంతో, దీని ద్వారా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. 2019 నుంచి 2022 వరకు ఈ ఫండ్ 30% పైగా రిటర్న్స్ అందించింది. ఇది సాధారణ పెట్టుబడిదారులకు మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ ఫండ్ ప్రధానంగా పెరుగుతున్న ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి, వాటి ద్వారా లాభాలు పొందే అవకాశం కల్పిస్తుంది. ప్రత్యేకంగా పబ్లిక్ సెక్టార్ సంస్థల వృద్ధిపై ఫోకస్ చేస్తుంది. దీంతో SBI PSU డైరెక్ట్ ప్లాన్ ఫండ్ ప్రాఫిటబుల్‌గా మారిపోయింది.

Read Also: AC Prices Soar: షాకింగ్.. త్వరలో పెరగనున్న ఏసీల ధరలు, కారణమిదేనా..


మూడేళ్ల తర్వాత

అయితే ఈ స్కీంలో దీర్ఘకాలంలో పెట్టుబడులకు మరింత లాభాలు వస్తాయి. ఉదాహరణకు దీనిలో నెలవారీ SIP ద్వారా SBI PSU ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారు కూడా మంచి లాభాలను ఆర్జించారు. ఒకవేళ ఈ ఫండ్‌లో మీరు 3 సంవత్సరాల పాటు నెలకు రూ. 10,000 చొప్పున SIP చేసి ఉంటే, మీకు మూడేళ్ల తర్వాత రూ. 4,35,076.471 లభించేవి. అంటే మీరు చేసిన పెట్టుబడి మొత్తం రూ. 3.60 లక్షలు మాత్రమే.

చేసిన పెట్టుబడికి..

ఒకవేళ మీరు ఐదేళ్ల కాలానికి రూ. 10,000 SIP ప్రారంభించి ఉంటే, మీకు వచ్చే మొత్తం రూ. 8,24,863.666 లక్షలు అవుతుంది. మీరు చేసిన పెట్టుబడి రూ. 6 లక్షలు మాత్రమే. ఇదే SIPని మీరు 15 సంవత్సరాల పాటు ప్రారంభించినట్లయితే, మీకు లభించేది రూ. 50,45,759.995 అవుతుంది. అంటే మీరు చేసే పెట్టుబడి రూ.12 లక్షలు కాగా, మీకు లభించేది మాత్రం 50 లక్షలు. అంటే మీరు చేసిన పెట్టుబడి మొత్తానికి దాదాపు నాలుగు రెట్లు వస్తుందని చెప్పవచ్చు. ఈ రాబడులు సగటున 12 శాతం వార్షిక రాబడి ప్రకారం లెక్కించారు. ఒకవేళ మీకు సగటు కంటే ఎక్కువ రాబడి వస్తే ఇంకా అధిక మొత్తం వచ్చే ఛాన్సుంది.

SBI PSU డైరెక్ట్ ప్లాన్ ప్రధాన లక్షణాలు

  • ఈ ఫండ్ ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని అంగీకరిస్తుంది
  • ఈ ఫండ్ పబ్లిక్ సెక్టార్ యూనిటీల షేర్లను కొంటుంది
  • 2019 నుంచి 2022 వరకు ఈ ఫండ్ 30% పైగా రిటర్న్స్ అందించింది
  • ఈ ఫండ్ ద్రవ్య ఇన్ఫ్లేషన్‌కి ఎలాంటి ప్రభావం చూపదు
  • ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతుగా ఉంటుంది
  • ఈ ఫండ్ ద్వారా మోస్తారు రిస్క్ ఉంటుంది. కానీ మంచి రిటర్న్స్ పొందడానికి దీర్ఘకాలంలో మంచి అవకాశాలను కల్పిస్తుంది

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×