BigTV English
Advertisement

Investment Plan: SBIలో అదిరిపోయే గ్రోత్ ప్లాన్.. పెట్టిన మొత్తంపై మూడు రెట్ల లాభం

Investment Plan: SBIలో అదిరిపోయే గ్రోత్ ప్లాన్.. పెట్టిన మొత్తంపై మూడు రెట్ల లాభం

Investment Plan: ప్రస్తుతం దేశంలోని అనేక మంది ప్రజల్లో పెట్టుబడులు చేసే ధోరణి మారిపోయింది. సాధారణ FDలతో పోలిస్తే, కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు కానీ, అధిక రిటర్న్స్ వచ్చేవి కావాలని అంటున్నారు. ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి SBI PSU డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. SBI PSU డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనేది మ్యూచువల్ ఫండ్ ఆప్షన్. ఈ ఫండ్ ఉద్దేశం ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీల (PSUs) స్టాక్స్‌లో పెట్టుబడులు చేయడం.


ప్రాఫిటబుల్‌ ఫండ్..

ఈ ప్లాన్ మ్యూచువల్ ఫండ్ వృద్ధి పథకం కావడంతో, దీని ద్వారా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. 2019 నుంచి 2022 వరకు ఈ ఫండ్ 30% పైగా రిటర్న్స్ అందించింది. ఇది సాధారణ పెట్టుబడిదారులకు మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ ఫండ్ ప్రధానంగా పెరుగుతున్న ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి, వాటి ద్వారా లాభాలు పొందే అవకాశం కల్పిస్తుంది. ప్రత్యేకంగా పబ్లిక్ సెక్టార్ సంస్థల వృద్ధిపై ఫోకస్ చేస్తుంది. దీంతో SBI PSU డైరెక్ట్ ప్లాన్ ఫండ్ ప్రాఫిటబుల్‌గా మారిపోయింది.

Read Also: AC Prices Soar: షాకింగ్.. త్వరలో పెరగనున్న ఏసీల ధరలు, కారణమిదేనా..


మూడేళ్ల తర్వాత

అయితే ఈ స్కీంలో దీర్ఘకాలంలో పెట్టుబడులకు మరింత లాభాలు వస్తాయి. ఉదాహరణకు దీనిలో నెలవారీ SIP ద్వారా SBI PSU ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారు కూడా మంచి లాభాలను ఆర్జించారు. ఒకవేళ ఈ ఫండ్‌లో మీరు 3 సంవత్సరాల పాటు నెలకు రూ. 10,000 చొప్పున SIP చేసి ఉంటే, మీకు మూడేళ్ల తర్వాత రూ. 4,35,076.471 లభించేవి. అంటే మీరు చేసిన పెట్టుబడి మొత్తం రూ. 3.60 లక్షలు మాత్రమే.

చేసిన పెట్టుబడికి..

ఒకవేళ మీరు ఐదేళ్ల కాలానికి రూ. 10,000 SIP ప్రారంభించి ఉంటే, మీకు వచ్చే మొత్తం రూ. 8,24,863.666 లక్షలు అవుతుంది. మీరు చేసిన పెట్టుబడి రూ. 6 లక్షలు మాత్రమే. ఇదే SIPని మీరు 15 సంవత్సరాల పాటు ప్రారంభించినట్లయితే, మీకు లభించేది రూ. 50,45,759.995 అవుతుంది. అంటే మీరు చేసే పెట్టుబడి రూ.12 లక్షలు కాగా, మీకు లభించేది మాత్రం 50 లక్షలు. అంటే మీరు చేసిన పెట్టుబడి మొత్తానికి దాదాపు నాలుగు రెట్లు వస్తుందని చెప్పవచ్చు. ఈ రాబడులు సగటున 12 శాతం వార్షిక రాబడి ప్రకారం లెక్కించారు. ఒకవేళ మీకు సగటు కంటే ఎక్కువ రాబడి వస్తే ఇంకా అధిక మొత్తం వచ్చే ఛాన్సుంది.

SBI PSU డైరెక్ట్ ప్లాన్ ప్రధాన లక్షణాలు

  • ఈ ఫండ్ ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని అంగీకరిస్తుంది
  • ఈ ఫండ్ పబ్లిక్ సెక్టార్ యూనిటీల షేర్లను కొంటుంది
  • 2019 నుంచి 2022 వరకు ఈ ఫండ్ 30% పైగా రిటర్న్స్ అందించింది
  • ఈ ఫండ్ ద్రవ్య ఇన్ఫ్లేషన్‌కి ఎలాంటి ప్రభావం చూపదు
  • ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతుగా ఉంటుంది
  • ఈ ఫండ్ ద్వారా మోస్తారు రిస్క్ ఉంటుంది. కానీ మంచి రిటర్న్స్ పొందడానికి దీర్ఘకాలంలో మంచి అవకాశాలను కల్పిస్తుంది

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×