E-Paper
Advertisement

Anam Mirza: ఏంటీ.. సానియా మీర్జా చెల్లెలు ఇంత ఆస్తి సంపాదించిందా..?

Anam Mirza: ఏంటీ.. సానియా మీర్జా చెల్లెలు ఇంత ఆస్తి సంపాదించిందా..?
Advertisement

 

Anam Mirza Success Story

Advertisement

Anam Mirza Success Story: భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి అందరికి తెలుసు. కానీ ఆమె చెల్లెలు “అనమ్ మీర్జా” గురించి అందరికి తెలియకపోవచ్చు. కాని ఈమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత !.. అనమ్ మీర్జా గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

“అనమ్ మీర్జా” మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ పూర్తి చేసి వివిధ జాతీయ ఛానెల్ లలో ఇంటర్న్ గా జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించి.. వ్యాపార రంగంలో ముందుకు సాగుతోంది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఈమెకు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే 2013 లో ఔత్సాహిక జర్నలిస్టుల కోసం “ఇంక్ టు ఛేంజ్” అనే వెబ్ సైట్ ప్రారంభించింది. 2014 లో అక్బర్ రషీద్ తో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె “ది లేబుల్ బజార్” అనే ఫ్యాషన్ లేబుల్ ని ప్రారంభించింది. 2022లో అనమ్ మీర్జా భారతదేశపు అతి పెద్ద రంజాన్ ఎక్స్ పో, దావత్-ఎ-రంజాన్ ను స్థాపించింది.

Advertisement

అనమ్ మీర్జా తన భర్త అక్బర్ రషీద్ తో విడిపోయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ & రాజకీయ నాయకుడు అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్ ను వివాహం చేసుకుంది. వీరికి “దువా” అనే పాప కూడా ఉంది. అనమ్ మీర్జా తన పాప పేరు మీద 2023లో మరో ఫ్యాషన్ లేబుల్ ను ప్రారంభించింది. మహమ్మద్ అసదుద్దీన్ తండ్రి బాటలో నడిచి బ్యాటర్ గా మారిన క్రికెట్ కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో క్రికెట్ ను విడిచి పెట్టాడు. అసదుద్దీన్ క్రికెటర్ కాక ముందే న్యాయవాది కూడా.

వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న “అనమ్ మీర్జా” వ్యాపారాల నికర విలువ 40 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. దీంతో పాటు వ్యాపారాలు మాత్రమే కాకుండా 1,25,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అంటే భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఆమె ఆస్తి విలువ రూ.331 కోట్ల కంటే ఎక్కువ.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×