E-Paper
Advertisement

Pm Modi Scuba Diving : మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

Pm Modi Scuba Diving : మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

 

PM Modi dives down to submerged city of Dwarka

PM Modi dives down to submerged city of Dwarka: ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్రం లోలోతుల్లోకి వెళ్లిన ఆయన.. ద్వారక మునిగిపోయిన ప్రాంతాన్ని సందర్శించారు. భారత సంస్కృతికి, ఆధ్యాత్మికతకు నెలవైన ఆ పురాతన స్థలి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

నీటి అడుగున శ్రీకృష్ణ భగవానుడికి నెమలి పింఛాన్ని కూడా సమర్పించారు. నీటిలో మునిగిన ద్వారకా నగరంలో పూజలు చేయడం దివ్యానుభవమని మోదీ ట్వీట్ చేశారు.

తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (ఫిబ్రవరి 25) దేవభూమి ద్వారకలోని పంచకుయ్ బీచ్‌లో అరేబియా సముద్ర తీరంలో స్కూబా డైవింగ్ చేశారు.

Read more:ఎన్నికల కోడ్‌.. మన్‌ కీ బాత్‌కు 3 నెలల బ్రేక్..

బేట్ ద్వారకా ద్వీపం సమీపంలోని ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్విన పురాతన ద్వారక నీటి అడుగున అవశేషాలను చూడవచ్చు.

ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయంలో కూడా ప్రధాని మోదీ ప్రార్థనలు చేశారు. అంతకుముందు, దేవభూమి ద్వారక జిల్లాలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలుపుతూ అరేబియా సముద్రంపై దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని ప్రారంభించారు. తర్వాత బేట్ ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో కూడా ఆయన ప్రార్థనలు చేశారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×