Central Govt Alert To Apple Users: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో యాపిల్ వస్తువుల క్రేజ్ మామూలుగా లేదు. ఈ తరుణంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యాపిల్ యూజర్లకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. హైరిస్క్ అలర్ట్ పేరిట బుధవారం భద్రతాపరమైన హెచ్చరికలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
యాపిల్ వస్తువుల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్’కు సంబంధించిన సెక్యూరిటఅ లోపాలను గుర్తించినట్లు సీఈఆర్టీ ఇన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు యాపిల్ వస్తువుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న యాపిల్ వస్తువుల్లో.. ఐఫోన్ కూడా ఉన్నట్లు పేర్కొంది.
యాపిల్ వస్తువుల్లో ఉన్న ఈ లోపాల కారణంగా హ్యాకర్లు కోడ్ ను ఎగ్జిక్యూట్ చేసి మన డివైజ్ లను ఆపరేట్ చేసే ఛాన్స్ ఉందని.. అదే కనుక జరిగితే దేశానికి భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ తరుణంలో యూజర్లు తమ యాపిల్ వస్తువుల్లో వెంటనే లేటెస్ట్ వెర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందులో ముఖ్యంగా ఐఫోన్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్ సెట్లకు హై రిస్క్ ఉన్నట్లు తెలిపింది.
Also Read: మీకు డ్రైవింగ్ రాదా.. ఏం పర్లేదు.. ఈ స్కూటీనే మిమ్మల్ని తీసుకెళ్తుంది
ఈ వెర్షన్లలో లోపాలు..
ఐఓఎస్
ఐ ప్యాడ్ ఓఎస్ 17.4.1, 16.7.7
సఫారీ 17.4.1
మ్యాక్ఓఎస్ వెంట్యురా 13.6.6
మ్యాక్ఓఎస్ సొనోమా 14.4.1
యాపిల్ విజన్ ఓఎస్ 1.1.1
ఐఫోన్ ఎక్స్ఎస్
ఐ ప్యాడ్ ప్రో 12.9, 10.5, 11 ఇంచ్
ఐప్యాడ్ ఎయిర్
ఐప్యాడ్ మినీ
ఇవే కాకుండా దీని కంటే ముందు ఉన్న వెర్షన్లలో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించామని సెర్ట్ ఇన్ స్పష్టం చేసింది. వీటితో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐప్యాడ్ 5 జెనరేషన్ వంటి యూజర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని.. వీరు కూడా హ్యాకింగ్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది. ఇప్పటికే ఒకసారి సెర్ట్ ఇన్ యాపిల్ వస్తువులకు అలర్ట్ జారీ చేయగా.. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేయడం భయాందోళనకు గురిచేస్తోంది.