BigTV English
Advertisement

Today Gold Price: అక్షయ తృతీయ వేళ.. దిగొచ్చిన పసిడి ధర

Today Gold Price: అక్షయ తృతీయ వేళ.. దిగొచ్చిన పసిడి ధర

Today Gold Price: అక్షయ తృతీయ వేళ.. మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,750 చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,910 వద్ద కొనసాగుతోంది.


అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారులు బంగారం షాపులకు తరలివెళ్తున్నారు. ఇక పండుగ రోజు గోల్డ్ కొనుగోలు చేస్తే అదృష్టంగా భావిస్తారు. గత కొద్ది రోజులుగా పసిడి ధర పెరిగి లక్ష రూపాయలు మార్కు చేరడంతో.. కొందరు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా పలు షాపులు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. బంగారం రేట్లు రికార్డు స్థాయిలో పెరగడంతో కస్టమర్లు సెంటిమెంట్‌ను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది.

అయితే కొందరు మాత్రం 24 క్యారేట్ల గ్రాము బంగారం 8900 రేటు పలుకుతున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ. ఇంట్లో పూజలు చేసుకుని బంగారం కొనేందుకు జ్యూయలరీ షాపులకు వస్తున్నారు. గతంతో పోల్చితే అమ్మకాలు ఆ స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు.


దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌ను స్థిరంగా ప్రారంభించాయి. గ్లోబల్‌గా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రారంభంలో స్థిరంగా ప్రారంభమైన సూచీలు తర్వాత నెగటివ్‌ వైపుకు జారుకున్నాయి.

ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 66 పాయింట్ల నష్టంతో 80,204 స్థాయిలో ట్రేడవుతుండగా, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24,305 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌కు చెందిన 30 షేర్లలో బజాజ్ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫైనాన్స్‌,ఇండస్‌ఇండ్ బ్యాంక్‌,టాటా, మోటార్స్‌, ఎస్‌బీఐ, ఎటర్నల్‌, టాటా మోటార్స్‌, ఏషియన్ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బంగారం ధరలు ఇలా

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 పలుకుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 ఉంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,900 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 040 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద కొనసాగుతోంది.

ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 910 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

Also Read: ఒకే రీచార్జ్‌ ఏడాది మొత్తం ఫ్రీడమ్..720జీబీ డేటాతోపాటు కాలింగ్ కూడా..

వెండి ధరలు ఇలా..

అక్షయ తృతీయ సందర్భంగా.. వెండి ధరలు దిగొచ్చాయి.
ఈరోజు(ఫిబ్రవరి 30)న వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,09,000 కి చేరుకుంది.

ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,400 వద్ద కొనసాగుతోంది.

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×