Toll Charges Hiked in Telugu States from 1st April 2024: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకల టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు.. ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఏడాదికోసారి టోల్ రుసుము పెరుగుతుంది. హైదరాబాద్ – విజయవాడ మధ్యలో ఉన్న పంతంగి, చిల్లకల్లు, కొర్లపహాడ్ టోల్ ఛార్జీలు పెరిగాయి. కార్లు, వ్యాన్లు, జీపులకు వన్ వే ప్రయాణానికి రూ.5, టూ వే ప్రయాణానికి రూ.10, ఇతర లైట్ వెయిట్ రవాణా వాహనాలకు ఒకవైపు రూ.10, రానుపోను రూ.20 మేర పెంచారు.
Also Read: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
అలాగే బస్సులు, ట్రక్కులకు రూ.25, రూ.35 మేర రవాణా ఛార్జీలు పెంచారు. ఇతర భారీ వాహనాలకు రూ.35 నుంచి రూ.50 మేర పెంచారు. 24 గంటల్లోగా తిరుగు ప్రయాణం చేసిన వాహనాలకు టోల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఉంటుంది. ఇక స్థానికులు తీసుకునే నెలవారీ పాస్ ఛార్జీలు కూడా పెరిగాయి. రూ.330 నుంచి రూ.340కి పెంచారు. మొత్తమ్మీద పెరిగిన టోల్ ఛార్జీల కారణంగా.. సామాన్యులపై భారం పడనుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ టోల్ ఛార్జీలే అమల్లో ఉంటాయి.