E-Paper
Advertisement

Toll Charges Hiked in AP and TG: పెరిగిన టోల్ ఛార్జీలు.. నేటి నుంచే అమల్లోకి..!

Toll Charges Hiked in AP and TG: పెరిగిన టోల్ ఛార్జీలు.. నేటి నుంచే అమల్లోకి..!

Toll Charges Hiked in Telugu States from 1st April 2024: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకల టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు.. ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఏడాదికోసారి టోల్ రుసుము పెరుగుతుంది. హైదరాబాద్ – విజయవాడ మధ్యలో ఉన్న పంతంగి, చిల్లకల్లు, కొర్లపహాడ్ టోల్ ఛార్జీలు పెరిగాయి. కార్లు, వ్యాన్లు, జీపులకు వన్ వే ప్రయాణానికి రూ.5, టూ వే ప్రయాణానికి రూ.10, ఇతర లైట్ వెయిట్ రవాణా వాహనాలకు ఒకవైపు రూ.10, రానుపోను రూ.20 మేర పెంచారు.

Also Read: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

అలాగే బస్సులు, ట్రక్కులకు రూ.25, రూ.35 మేర రవాణా ఛార్జీలు పెంచారు. ఇతర భారీ వాహనాలకు రూ.35 నుంచి రూ.50 మేర పెంచారు. 24 గంటల్లోగా తిరుగు ప్రయాణం చేసిన వాహనాలకు టోల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఉంటుంది. ఇక స్థానికులు తీసుకునే నెలవారీ పాస్ ఛార్జీలు కూడా పెరిగాయి. రూ.330 నుంచి రూ.340కి పెంచారు. మొత్తమ్మీద పెరిగిన టోల్ ఛార్జీల కారణంగా.. సామాన్యులపై భారం పడనుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ టోల్ ఛార్జీలే అమల్లో ఉంటాయి.

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×