BigTV English
Advertisement

Top 5 Fastest Trains In India: భారతదేశంలోని టాప్ 5 వేగవంతమైన రైళ్లు.. స్పీడ్‌లోనే కాదు, లగ్జరీలోనూ తోపే!

Top 5 Fastest Trains In India: భారతదేశంలోని టాప్ 5 వేగవంతమైన రైళ్లు.. స్పీడ్‌లోనే కాదు, లగ్జరీలోనూ తోపే!

Top-5 Fastest Trains In India: భారతదేశంలో ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతేకాకుండా దీని కారణంగానే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. కాగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను భారతీయులకు లైఫ్‌లైన్ అని పిలుస్తారు. ఇది ప్రతిరోజూ 25 మిలియన్లకు పైగా ప్రజలు ప్రయాణించే నెట్‌వర్క్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల భారతీయ రైల్వేను రవాణా వ్యవస్థకు వెన్నెముక అని కూడా పిలుస్తారు. సాధారణ రైళ్ల నుండి విలాసవంతమైన హై-స్పీడ్ రైళ్ల వరకు భారతీయ రైల్వే తన ప్రయాణీకుల విభిన్న అవసరాలను తీర్చడానికి ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, మెయిల్, DMU రైళ్లతో సహా పలు రకాల సేవలను నిర్వహిస్తోంది.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. దీనిని రైలు 18 అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు. దీని గరిష్ట వేగం గంటకు 180 కిమీగా ఉంది. కానీ సాధారణంగా ఇది గంటకు 120 నుండి 130 కిమీ వేగంతో నడుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ఈ స్వదేశీ అద్భుతం దేశవ్యాప్తంగా 50కి పైగా రైళ్లు సేవలందించడంతో అపారమైన ప్రజాదరణను పొందింది. అయితే ఇప్పుడు భారతదేశంలోని టాప్-5 వేగవంతమైన రైళ్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గతిమాన్ ఎక్స్‌ప్రెస్


గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళును 2016లో ప్రవేశపెట్టారు. ఇది గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో భారతదేశంలో రెండవ అత్యంత వేగవంతమైన రైళుగా పేరుగాంచింది. లగ్జరీ, వేగానికి ప్రసిద్ధి చెందిన ఈ రైలు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. రైలు నంబర్ 12049/12050 కింద నడుస్తుంది. ఈ రైలు న్యూఢిల్లీ నుండి ఝాన్సీ మధ్య నడుస్తుంది. ప్రయాణీకులకు వేగవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

 Also Read: ప్రయాణికులకు అలర్ట్.. సంక్రాంతి పండక్కి..4 నెలల ముందే రైలు టికెట్ల బుకింగ్

భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్

ఇక పైన పేర్కొన్న రైళు తరహాలో మరొకటి ఉంది. అదే భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది భారతదేశంలో మూడవ అత్యంత వేగవంతమైన రైలు. న్యూఢిల్లీ, భోపాల్‌లోని రాణి కమలాపతి స్టేషన్ మధ్య నడుస్తుంది. ఈ రైలు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్

భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఒకటి. ముంబై-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలలో అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ రైళు గంటకు 140 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ రైళ్లు వాటి ఆన్‌బోర్డ్ సౌకర్యాలు, హై క్లాస్ సేవలకు ప్రసిద్ధి చెందాయి.

దురంతో ఎక్స్‌ప్రెస్

మరొక హై-స్పీడ్ ఎంపిక దురంతో ఎక్స్‌ప్రెస్. ఈ నాన్-స్టాప్ సర్వీస్ ఎటువంటి ఇంటర్మీడియట్ స్టాప్‌లు లేకుండా గంటకు 135 కి.మీ వేగంతో ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతుంది. సమర్థతను కోరుకునే సుదూర ప్రయాణీకులకు ఇది వేగవంతమైన ఎంపికను అందిస్తుంది.

తేజస్ ఎక్స్‌ప్రెస్

తేజస్ ఎక్స్‌ప్రెస్ దాని ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణ సమయానికి ప్రసిద్ధి చెందింది. రైల్వే సేవలను మెరుగుపరిచే ప్రభుత్వ చొరవలో భాగంగా ఇది వేగం, భద్రత, సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. ఈ హై-స్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా లక్షలాది మందిని రవాణా చేస్తుంది. దీని కారణంగా సుదూర ప్రయాణాలు చేసే వారు ఈ వేగవంతమైన ట్రైన్‌లో జర్నీ చేసి అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×