E-Paper
Advertisement

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!
Advertisement

UPI Lite Wallet: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న, చిన్న లావాదేవీలు చేసే డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లైట్‌ను ఈ-మాండేట్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విధానంతో యూపీఐ లైట్‌లో ఆటోమెటిక్‌గా క్యాష్ లోడ్ చేసుకునే ఫీచర్‌ను ప్రతిపాదించింది. ఈ విధానంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఫాస్టాగ్‌కు కూడా ఇదే విధానాన్ని ఆర్‌బీఐ సూచించింది.

చెల్లింపులు పెరగనున్నాయా..?

Advertisement

యూపీఐ లైట్ ఓ వ్యాలెట్‌లా పనిచేస్తుంది. ఈ విధానంతో చేసే చెల్లింపులకు పిన్ నంబర్ అవసరం ఉండదు. దీంతో చెల్లింపులు పెరగనున్నాయి. ఇందులో గరిష్టంగా రూ.2వేల వరకు లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కరోజులో రూ.2వేలు మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఒక్క రోజు కూడా గరిష్టంగా రూ.500 మాత్రమే పేమెంట్ చేసేందుకు వీలు ఉండనుంది. యూపీఐకి చెందిన సులభతరమైన వెర్షన్.. ఈ యూపీఐ లైట్. యూపీఐ విధానాన్ని మరింత సౌలభ్యంగా మారుస్తూ యూపీఐ లైట్ వెర్షన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

వ్యాలెట్‌లో బ్యాలెన్స్

Advertisement

ఆర్‌బీఐ తీసుకొస్తున్న ఈ-మాండేట్ విధానంతో యూపీఐ లైట్ మరింత సులభంగా, సౌకర్యవంతంగా పనిచేయనుంది. దీంతో వినయోగం సైతం పెరిగే అవకాశం ఉండనుంది. ఈ-మాండేట్ విధానం కిందకొస్తే.. యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఎప్పటికీ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ తగ్గిన వెంటనే.. ఈ-మాండేట్ విధానంతో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ లోడ్ అవుతోంది. ఇలా అనుకోకుండా యూజర్స్ క్యాష్ లోడ్ చేయడం మరిచిపోయిన సమయంలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా క్యాష్ లోడ్ కానుంది. అయితే లిమిట్ విషయంలో యూజర్స్‌ నిర్ణయంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో బ్యాలెన్స్ తగ్గే అవకాశం ఉండదు.

Also Read: నో ఛేంజ్.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

ప్రయాణికులకు బెస్ట్ ఆప్షన్

యూపీఐ లైట్.. ఈ-మాండేట్ విధానంతో యూజర్స్ ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా డిజిటల్ లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఫాస్టాగ్‌తోపాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటిని ఈ-మాండేట్ విధానంలోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. ఫాస్టాగ్ కార్డులో వ్యాలెట్ క్యాష్ తగ్గితే.. లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా వ్యాలెట్‌లోకి చేరుతుంది. దీంతో ప్రయాణ సమయాల్లో టోల్ గేట్ లావాదేవీల్లో నగదు ఇబ్బందుల సమస్య తలెత్తే అవకాశం ఉండదు.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×