BigTV English
Advertisement

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న, చిన్న లావాదేవీలు చేసే డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లైట్‌ను ఈ-మాండేట్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విధానంతో యూపీఐ లైట్‌లో ఆటోమెటిక్‌గా క్యాష్ లోడ్ చేసుకునే ఫీచర్‌ను ప్రతిపాదించింది. ఈ విధానంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఫాస్టాగ్‌కు కూడా ఇదే విధానాన్ని ఆర్‌బీఐ సూచించింది.


చెల్లింపులు పెరగనున్నాయా..?

యూపీఐ లైట్ ఓ వ్యాలెట్‌లా పనిచేస్తుంది. ఈ విధానంతో చేసే చెల్లింపులకు పిన్ నంబర్ అవసరం ఉండదు. దీంతో చెల్లింపులు పెరగనున్నాయి. ఇందులో గరిష్టంగా రూ.2వేల వరకు లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కరోజులో రూ.2వేలు మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఒక్క రోజు కూడా గరిష్టంగా రూ.500 మాత్రమే పేమెంట్ చేసేందుకు వీలు ఉండనుంది. యూపీఐకి చెందిన సులభతరమైన వెర్షన్.. ఈ యూపీఐ లైట్. యూపీఐ విధానాన్ని మరింత సౌలభ్యంగా మారుస్తూ యూపీఐ లైట్ వెర్షన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


వ్యాలెట్‌లో బ్యాలెన్స్

ఆర్‌బీఐ తీసుకొస్తున్న ఈ-మాండేట్ విధానంతో యూపీఐ లైట్ మరింత సులభంగా, సౌకర్యవంతంగా పనిచేయనుంది. దీంతో వినయోగం సైతం పెరిగే అవకాశం ఉండనుంది. ఈ-మాండేట్ విధానం కిందకొస్తే.. యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఎప్పటికీ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ తగ్గిన వెంటనే.. ఈ-మాండేట్ విధానంతో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ లోడ్ అవుతోంది. ఇలా అనుకోకుండా యూజర్స్ క్యాష్ లోడ్ చేయడం మరిచిపోయిన సమయంలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా క్యాష్ లోడ్ కానుంది. అయితే లిమిట్ విషయంలో యూజర్స్‌ నిర్ణయంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో బ్యాలెన్స్ తగ్గే అవకాశం ఉండదు.

Also Read: నో ఛేంజ్.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

ప్రయాణికులకు బెస్ట్ ఆప్షన్

యూపీఐ లైట్.. ఈ-మాండేట్ విధానంతో యూజర్స్ ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా డిజిటల్ లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఫాస్టాగ్‌తోపాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటిని ఈ-మాండేట్ విధానంలోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. ఫాస్టాగ్ కార్డులో వ్యాలెట్ క్యాష్ తగ్గితే.. లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా వ్యాలెట్‌లోకి చేరుతుంది. దీంతో ప్రయాణ సమయాల్లో టోల్ గేట్ లావాదేవీల్లో నగదు ఇబ్బందుల సమస్య తలెత్తే అవకాశం ఉండదు.

Related News

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Big Stories

×