E-Paper
Advertisement

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం.. యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా మనీ ట్రాన్స్‌ఫర్!

UPI Lite Wallet: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న, చిన్న లావాదేవీలు చేసే డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లైట్‌ను ఈ-మాండేట్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విధానంతో యూపీఐ లైట్‌లో ఆటోమెటిక్‌గా క్యాష్ లోడ్ చేసుకునే ఫీచర్‌ను ప్రతిపాదించింది. ఈ విధానంతో లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఫాస్టాగ్‌కు కూడా ఇదే విధానాన్ని ఆర్‌బీఐ సూచించింది.

చెల్లింపులు పెరగనున్నాయా..?

యూపీఐ లైట్ ఓ వ్యాలెట్‌లా పనిచేస్తుంది. ఈ విధానంతో చేసే చెల్లింపులకు పిన్ నంబర్ అవసరం ఉండదు. దీంతో చెల్లింపులు పెరగనున్నాయి. ఇందులో గరిష్టంగా రూ.2వేల వరకు లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కరోజులో రూ.2వేలు మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఒక్క రోజు కూడా గరిష్టంగా రూ.500 మాత్రమే పేమెంట్ చేసేందుకు వీలు ఉండనుంది. యూపీఐకి చెందిన సులభతరమైన వెర్షన్.. ఈ యూపీఐ లైట్. యూపీఐ విధానాన్ని మరింత సౌలభ్యంగా మారుస్తూ యూపీఐ లైట్ వెర్షన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

వ్యాలెట్‌లో బ్యాలెన్స్

ఆర్‌బీఐ తీసుకొస్తున్న ఈ-మాండేట్ విధానంతో యూపీఐ లైట్ మరింత సులభంగా, సౌకర్యవంతంగా పనిచేయనుంది. దీంతో వినయోగం సైతం పెరిగే అవకాశం ఉండనుంది. ఈ-మాండేట్ విధానం కిందకొస్తే.. యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఎప్పటికీ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ తగ్గిన వెంటనే.. ఈ-మాండేట్ విధానంతో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ లోడ్ అవుతోంది. ఇలా అనుకోకుండా యూజర్స్ క్యాష్ లోడ్ చేయడం మరిచిపోయిన సమయంలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్‌లోకి ఆటోమేటిక్‌గా క్యాష్ లోడ్ కానుంది. అయితే లిమిట్ విషయంలో యూజర్స్‌ నిర్ణయంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో బ్యాలెన్స్ తగ్గే అవకాశం ఉండదు.

Also Read: నో ఛేంజ్.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం

ప్రయాణికులకు బెస్ట్ ఆప్షన్

యూపీఐ లైట్.. ఈ-మాండేట్ విధానంతో యూజర్స్ ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా డిజిటల్ లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఫాస్టాగ్‌తోపాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ వంటి వాటిని ఈ-మాండేట్ విధానంలోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. ఫాస్టాగ్ కార్డులో వ్యాలెట్ క్యాష్ తగ్గితే.. లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా వ్యాలెట్‌లోకి చేరుతుంది. దీంతో ప్రయాణ సమయాల్లో టోల్ గేట్ లావాదేవీల్లో నగదు ఇబ్బందుల సమస్య తలెత్తే అవకాశం ఉండదు.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×