E-Paper
Advertisement

UPI New Rules: యూపీఐ కొత్త రూల్స్.. నేటి నుంచి 10 లక్షల వరకు, ఇంకెందుకు ఆలస్యం

UPI New Rules: యూపీఐ  కొత్త రూల్స్.. నేటి నుంచి 10 లక్షల వరకు, ఇంకెందుకు ఆలస్యం

UPI New Rules: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI వినియోగదారులకు శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15 లావాదేవీల పరిమితిని పెంచింది. గతంలో రూ. 5 లక్షలుగా ఉండే పరిమితిని ఇప్పుడు అమాంతంగా రెట్టింపు చేసింది. అదేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

చిన్న వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకు ఉపయోగపడేలా యూపీఐ కొత్త మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కీలక రంగాలలో పెద్ద చెల్లింపులను సులభంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వ్యక్తి నుండి వ్యక్తికి (P2P) చెల్లింపులకు రోజువారీ పరిమితి లక్ష వరకు ఉంటుంది. ఇందులో ఏ మాత్రం పెంపు లేదు.

కొత్త రూల్స్ ప్రకారం.. ప్రధానంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి, బీమా ప్రీమియం, EMI, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు వటి లావాదేవీలకు వర్తిస్తుందని NPCI స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రజలు ఈ చెల్లింపులను ఒకేసారి సులభంగా చేసుకోవచ్చు. గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియమ్, ఈఎంఐలు చెల్లించాలంటే రెండు, మూడు సార్లు ట్రాన్సాక్షన్ చేసేవారు. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు.

కొత్త రూల్స్ ప్రకారం ఒక్క ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయవచ్చు. ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ వంటివి ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయవచ్చు. ప్రభుత్వం ఈ-మార్కెట్ ప్లేస్‌లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చెల్లించుకోవచ్చు.

ALSO READ: రూ. 149 రీఛార్జ్ చేస్తే క్యాష్‌బ్యాక్.. జియో కొత్త ఆఫర్ల వివరాలు

క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడంలో టెన్షన్ అవసరం లేదు. ఓకేసారి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు క్రెడిట్ కార్డు బిల్లులు క్లియర్ చేయవచ్చు. ఆభరణాలు కోసం అయితే రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు చెల్లించుకోవచ్చు.

బిజినెస్ లేదా మర్చంట్ పేమెంట్స్‌కి రూ.5 లక్షల వరకు ఒకేసారి ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. ఎఫ్ ఎక్స్ రిటైల్ కేవలం ఐదు లక్షల వరకు మాత్రమే. డిజిటల్ అకౌంట్ ఓపెన్‌కు 5 లక్షల వరకు ఉంటుంది. డిజిటల్ అకౌంట్ ఓపెన్-ఇనీషియల్ ఫండింగ్ రోజుకు రెండు లక్షల వరకు మాత్రమే ఉండనుంది.

డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో NPCI ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పెద్ద చెల్లింపులను చేయడానికి వినియోగదారులు పలుమార్లు లావాదేవీలు చేసేవారు. ఇప్పుడు ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది. దీంతో లావాదేవీ ప్రక్రియ వేగవంతం కానుంది. డిజిటల్ ఇండియాను మరింత బలోపేతం చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×