BigTV English

UPI Payment Fee: యూజర్లకు అలర్ట్.. ఇకపై చెల్లింపులపై ఫైన్ విధించే ఛాన్స్

UPI Payment Fee: యూజర్లకు అలర్ట్.. ఇకపై చెల్లింపులపై ఫైన్ విధించే ఛాన్స్

UPI Payment Fee: ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగిపోతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే సహా పలు రకాల యాప్స్ ద్వారా ప్రతి రోజు లావాదేవీలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో ఫోన్ రీఛార్జ్ సహా పలు రకాల చెల్లింపులు చేసినప్పుడు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు రుసుం వసూలు చేస్తున్నారు. కానీ మరికొన్ని రోజుల్లో మాత్రం యూపీఐ యాప్ ద్వారా చేసే ప్రతి చెల్లింపునకు రుసుం పడ్తుందని ఆయా వర్గాలు అంటున్నాయి.


సబ్సిడీ బంద్

అయితే ప్రభుత్వం UPI సేవలపై వ్యాపారులకు ఇచ్చే సబ్సిడీలో భారీ కోతలు విధించింది. దీంతో ఆయా కంపెనీలు ఇప్పుడు వినియోగదారుల నుంచి ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో UPIని ఉపయోగించే వారి లావాదేవీలు ఇప్పుడు మరింత ఖరీదైనదిగా మారనున్నాయి. యూపీఐ ఇప్పటికే రీఛార్జ్ సహా పలు రకాల చెల్లింపులపై వినియోగదారుల నుంచి రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది.

ప్రభుత్వం నుంచి వ్యాపారులకు

అయితే ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 2,000 కంటే తక్కువ లావాదేవీలపై సబ్సిడీని అందిస్తోంది. ప్రతి సంవత్సరం పర్సన్ 2 వ్యాపారి లావాదేవీలకు రూ. 12,000 కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ క్రమంలో 2023లో ప్రభుత్వం నుంచి వ్యాపారులకు రూ. 2,600 కోట్ల సబ్సిడీ లభించింది. అదే సమయంలో 2024లో ఈ సబ్సిడీ మొత్తం రూ. 2,484 కోట్లు. కానీ ఈ సబ్సిడీని 2025లో రూ. 477 కోట్లకు తగ్గించారు. దీంతో తమపై ఆర్థిక భారం పడుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో యూజర్ల నుంచి రుసుములను వసూలు చేసేందుకు ఫోన్ పే సహా ఆయా సంస్థలు సిద్ధమవుతున్నాయి.


Read Also: Portable Air Cooler: రూ. 500కే అదిరిపోయే పోర్టబుల్ కూలర్.. దీని స్పెషల్ ఏంటంటే..

సగటున ప్రతిరోజూ..

ప్రస్తుత కాలంలో UPI చెల్లింపులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. సగటున ప్రతిరోజూ UPI ద్వారా 60 నుంచి 80 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిలో భారతదేశంలోనే UPI లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వందల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు UPI ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు.

అనేక ఇతర సేవలకు

UPIని దుకాణాలలో షాపింగ్ చేయడానికి మాత్రమే కాకుండా అనేక ఇతర సేవలకు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రజలు పెట్రోల్, మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్, వివిధ రకాల బిల్లు చెల్లింపులు, రైల్వే విమాన టిక్కెట్లు, సినిమా టిక్కెట్లు, ఫాస్ట్‌ట్యాగ్, గ్యాస్ బుకింగ్, డబ్బు బదిలీ, మెట్రో కార్డ్ రీఛార్జ్, బీమా ప్రీమియం మొదలైన వాటికి కూడా UPIని వాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో UPI ప్రతి చెల్లింపులకు రుసుములు అమలు చేస్తే పెద్ద సంఖ్యలో ప్రజలపై రుసుముల భారం అవకాశం ఉంది.

పేటీఎం, ఫోన్‌పే కూడా

మరోవైపు గూగుల్ పే కూడా అనేక లావాదేవీలపై రుసుములను వసూలు చేస్తుంది. గూగుల్ పే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 0.5% నుంచి 1% రుసుములు విధించింది. దీంతోపాటు పేటీఎం, ఫోన్‌పే కూడా మొబైల్ రీఛార్జ్ కోసం రుసుము వసూలు చేయడం ప్రారంభించాయి.

Tags

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×