E-Paper
Advertisement

Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 10 మంది మృతి

Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 10 మంది మృతి

Road Accident: రాజస్థాన్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం జరగడం అందులోను పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడంతో తీవ్ర ఆందోళన రేకిత్తిస్తోంది.

తాజాగా రాజస్థాన్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ పరిధిలో డంపర్ ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వంగలపూడి అనిత

రాజస్థాన్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం భజన్ల శర్మ. బాధిత కుటుంబాలకు సహాయం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×