Road Accident: రోడ్డుపై నడిచేటప్పుడు చిన్న పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండటం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో.. దానిపై ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక చిన్నారి తన తల్లి చేయి పట్టుకుంటే విడిపించుకోని మరి పరిగెత్తుకుంటూ వచ్చాడు.. అప్పుడు అక్కడి నుంచి వేగంగా వచ్చిన బైకర్ ఆ బిడ్డను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా కింద పడిపోయారు.
ఈ హృదయవిదారక ఘటనను ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, “తల్లిదండ్రులారా.. రోడ్డుపై నడిచేటప్పుడు పిల్లల చేయి అస్సలు వదలకండి.. గట్టిగా పట్టుకోండి” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
సాధారణంగా చిన్న పిల్లలకు రోడ్డుపై వాహనాల వేగం, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన ఉండదు. వారు ఒక్కసారిగా రోడ్డుపైకి పరిగెత్తే అవకాశం ఉంటుంది, దీనివల్ల వాహనదారులు అప్రమత్తమయ్యే లోపే ప్రమాదం జరిగిపోతుంది. అందుకే రద్దీగా ఉండే రోడ్లపై వెళ్లేటప్పుడు పిల్లల చేయి పట్టుకోవడం మాత్రమే కాదు, వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. కేవలం క్షణకాలం పాటు చూపే అజాగ్రత్త కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ వీడియో ద్వారా సజ్జనార్ సందేశాన్ని ఇచ్చారు.
Also Read: మొబైల్ నెంబర్ బ్లాక్.. రగిలిపోయిన ప్రియురాలు, ఏం చేసిందో తెలుసా?
అంతేకాకుండా వాహనదారులు కూడా నివాస ప్రాంతాల్లో, పాఠశాలల సమీపంలో ప్రయాణించేటప్పుడు వేగ నియంత్రణ పాటించడం ఎంతో అవసరం. పిల్లలు ఎటువైపు నుంచి రోడ్డుపైకి వస్తారో ఊహించడం కష్టం కాబట్టి, డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, విలువైన ప్రాణాలను కాపాడటానికి అని గుర్తించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే రోడ్డు ఎలా దాటాలో, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత ఏంటో నేర్పించడం కూడా ఎంతో ముఖ్యం.
WARNING: SENSITIVE CONTENT
"రోడ్డుపై వెళ్తున్నప్పుడు పిల్లల చేయి వదలొద్దు"
రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ఢీకొన్న బైకర్
చిన్నారిని ఢీకొట్టి కింద పడిపోయిన బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు
ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సీపీ సజ్జనార్… pic.twitter.com/lu4LRLMfLT
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2026