E-Paper
Advertisement

Techie Suicide: ప్రియుడిపై కేసు.. ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య, తీగలాగితే..

Techie Suicide: ప్రియుడిపై కేసు.. ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య, తీగలాగితే..

Techie Suicide: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే అందుకు కారణాలు చాలానే ఉంటాయి. రేపో మాపో వివాహం కావాల్సిన ఓ మహిళ టెక్కీ అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కేవలం తన ప్రియుడిపై కేసు నమోదు చేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగుచూసింది.

ప్రియుడిపై కేసు.. ఆపై టెక్కీ ఆత్మహత్య

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ ప్రాంతంలోని రాంపూర్‌కు చెందినది టెక్కీ అనూష. ఆమె వయస్సు 22 ఏళ్లు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే అనూష.. వరంగల్‌‌ లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన పవన్‌ను ప్రేమించింది. వీరిద్దరు వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఈ విషయాన్ని వారిద్దరు వారి వారి తల్లిదండ్రులకు చెప్పారు. వారిని ఏదో విధంగా  కన్వీన్స్ చేశారు. మొత్తానికి ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడం తో మార్చిలో వివాహం చేయాలని డిసైడ్ అయ్యారు.

దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు

సీన్ కట్ చేస్తే.. ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో పవన్‌పై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం హైదరాబాద్ పోలీసుల ద్వారా అనూష కుటుంబసభ్యులకు తెలిసింది. ఈ విషయం తెలియగానే అప్పటినుంచి అనూష అప్‌సెట్ అయ్యింది. మానసికంగా బాధపడుతూ కనిపించేది.

చివరకు మనస్తాపం చెంది బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది అనూష. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంతకీ పవన్‌పై ఎందుకు కేసు నమోదు అయ్యింది? అంతకుముందు జరిగిన వ్యవహారం ఏంటి? ఆయా విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: రక్తంలో ప్రేమ లేఖ.. తనను కాదంటే నీ గుట్టు బయటపెడతా

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×