Parakamani Theft Case: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరకామని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చెందారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై ఆయన విగత జీవిగా కనిపించారు. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ బృందం విచారిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజన్స్ ఇన్పెక్టర్గా సతీష్ పనిచేస్తున్నారు. అతని మృతదేహం వెనుక కుట్రకోణం ఉండవచ్చని అనుమానిస్తున్నారు అధికారులు.
సతీష్ కుమార్ మృతదేహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, శరీరం వెనుక వెనుక భాగంలో మాత్రమే గాయాలు ఉండటంతో ఇది ప్రమాదం కాదు.. హత్యే అన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు.
ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ఘటన రాత్రి 2 గంటల నుండి 3 గంటల మధ్యలోనే జరిగినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగిలినట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు అత్యంత కీలక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతీష్ ప్రయాణిస్తున్న రైలు కోచ్లోనే అతనిపై దాడి జరిగి, తరువాత కిందికి తోసివేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సతీష్ ప్రయాణించిన A1 బోగీలో ఆ సమయంలో ఎవరు ప్రయాణించారు? ఏ సీట్లలో ఎవరు ఉన్నారు? ఎవరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు, పోలీసులు ప్రయాణికుల పూర్తి లిస్ట్ను తెప్పించారు.
Also Read: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి
ప్రస్తుతానికి ఆ బోగీలో ప్రయాణించిన వారికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, టికెట్ రికార్డులు, ఫోన్ లొకేషన్లు క్లుప్తంగా పరిశీలిస్తున్నారు. దాడి జరగడానికి ముందు, తరువాత కోచ్లో ఏవైనా వాగ్వాదాలు జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.