E-Paper
Advertisement

Ganja Seized: తెలివి మీరిన గంజాయి బ్యాచ్.. ఆ విషయం తెలియకుండా పెద్ద ప్లాన్ వేశారు

Ganja Seized: తెలివి మీరిన గంజాయి బ్యాచ్.. ఆ విషయం తెలియకుండా పెద్ద ప్లాన్ వేశారు
Advertisement

Ganja Seized: గంజాయి బ్యాచ్ తెలివి మితిమీరి పోయారు. గంజాయి వాసన నోట్లో నుండి రాకుండా కొత్త పద్దతులు పాటిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలిస్తే చిక్కులు వస్తాయని గ్రహించి, సైలెంట్ గా తమ పని కానిచ్చేస్తున్నారు. ఆ బ్యాచ్ భరతం పట్టారు అనంతపురం పోలీసులు.

ఏపీలో గంజాయి ముఠా ఆటకట్టించేందుకు పోలీసులు పక్కా ప్లాన్ తో ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ జిల్లాలో కూడా గంజాయి అనే మాట వినిపించకుండా చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఆపరేషన్ గరుడ పేరిట ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధిస్తోంది. ఇటీవల పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న స్థితిగతులను తెలుసుకొనేందుకు డ్రోన్స్ ను కూడా రంగంలోకి దింపింది. ఈ చర్యలతో ఇటీవల రాష్ట్రంలో గంజాయి హవా తగ్గిందని చెప్పవచ్చు.

Advertisement

అలాగే విద్యార్థులు ఎవరూ, గంజాయి బారిన పడకుండా అవగాహన సదస్సులను సైతం ఏపీ పోలీస్ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇలా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా అనంతపురం పోలీసులు, గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాను పట్టుకున్న సమయంలో విస్తుపోయే నిజాలు పోలీసులకు తెలిశాయి. గంజాయి సేవించిన వారు, తమ విషయం బయటకు తెలియకుండా మోత్ ఫ్రెషనర్, ఐ డ్రాప్స్, ఖాలీ ఓసీ లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో అనంతపురం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 కిలోల కు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు మోత్ ఫ్రెషనర్, ఐ డ్రాప్స్, ఖాలీ ఓసీ లు వాడుతుండగా, వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Also Read: TDP vs YCP: కరెంటు సెగ.. ఏపీలో ఒకటే పొగ, నేరుగా కాకుండా ఇలా కొట్టుకుంటున్నారేంటి?

ఈ బ్యాచ్ లో ఒకరు మైనర్ కాగా, మిగిలిన వారు మేజర్లు కావడం విశేషం. మహారాష్ట్ర షోలాపుర్ నుంచి తక్కువ ధరకు గంజాయిని అనంతకు దిగుమతి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేజీ గంజాయి కి రూ. 85 వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ముఠా నాయకుడు సయ్యద్ నవాజ్ ని అరెస్ట్ చేశారు. ఈ బ్యాచ్ టార్గెట్ మాత్రం విద్యార్థులేనని తెలుసుకున్న పోలీసులు, ఆ దిశగా విచారణ సాగిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×