BigTV English
Advertisement

TDP vs YCP: కరెంటు సెగ.. ఏపీలో ఒకటే పొగ, నేరుగా కాకుండా ఇలా కొట్టుకుంటున్నారేంటి?

TDP vs YCP: కరెంటు సెగ.. ఏపీలో ఒకటే పొగ, నేరుగా కాకుండా ఇలా కొట్టుకుంటున్నారేంటి?

TDP vs YCP; ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ హీట్ కి సోషల్ మీడియా కూడా వేడెక్కింది. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య సై అంటే సై అనే రీతిలో సైలెంట్ వార్ సాగుతోంది. మీ పాలన అంటే మీ పాలన అంటూ మార్మోగుతోంది సోషల్ మీడియా. ఇంతలా పొలిటికల్ హీట్ కి కారణం విద్యుత్ ఛార్జీలు. అసలేం జరుగుతోందంటే..


రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు విద్యుత్ ఛార్జీలపై శుక్రవారం నిరసనలు కొనసాగిస్తున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వైసీపీ నిరసనల పర్వానికి శ్రీకారం చుట్టింది. ముందుగా అన్ని జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, అక్కడక్కడా వైసీపీ శ్రేణులు రహదారిపై బైఠాయించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా బందోబస్తు చేపట్టారు. ఇలా శుక్రవారం నిరసనల పర్వం సాగుతోంది.

అయితే వైసీపీ నిరసనలు ఏమో కానీ, టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఘాటు రిప్లై ఇస్తోంది. ఓ వైపు వైసీపీ సోషల్ మీడియా పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కూటమిదేనంటూ ఓ వైపు నిరసన సాగిస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేస్తోంది. దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో బిజీగా ఉంది టీడీపీ. 6 నెలల్లో విద్యుత్ ఛార్జీలను పెంచి కూటమి, ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని వైసీపీ అంటుండగా, మరోవైపు ఈ పాపం మీదేనంటూ టీడీపీ కోడై కూస్తోంది. ఐదేళ్లలో మాజీ సీఎం జగన్ మింగిన వేలకోట్ల లంచాల ధాటికి, అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందని, అదే ఇప్పుడు వినియోగదారులపై పెనుభారంగా మారిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.


Also Read: Nara Lokesh: ఒక్క ట్వీట్ తో.. ప్రాణం దక్కింది.. ఆమె ఇంటికి చేరింది!

నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ… కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరని ఈరోజు ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారంటూ టీడీపీ సీరియస్ కామెంట్స్ చేసింది. 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజల నుంచి ఐదేళ్ళలో రూ.32000 కోట్లు ముక్కు పిండి వసూలు చేసి.. 10వ సారి పెంచడానికి కూడా తానే అనుమతి తెచ్చుకున్న మాజీ సీఎం జగన్… ఇప్పుడు తానే ధర్నాలు చేయడం ఏంటోనంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది.

విద్యుత్ ఛార్జీల పెంపుపై రెండు పార్టీల మధ్య శుక్రవారం ఉదయం నుండి సైలెంట్ వార్ సాగుతోంది. నిమిష నిమిషానికి ఆరోపణల వర్షం రెండు పార్టీల మధ్య సాగుతోంది. దీనితో నెటిజన్స్ కూడా తమకు అనుకూలమైన పార్టీకి మద్దతు పలుకుతూ, తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఎవరి ప్రమేయం ఉందో కానీ, విద్యుత్ ఛార్జీలు మాత్రం మళ్లీ తగ్గేదిలేదుగా అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×