E-Paper
Advertisement

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

Arunachalam: భక్తుల గుండెల్లో భక్తిభావానికి, ప్రశాంతతకు నిలయమైన అరుణాచల మహాక్షేత్రంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అరుణాచల క్షేత్రంలో గిరిప్రదక్షిణ దారిలో ఇద్దరు యువతులపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలు స్థానికంగానే కాకుండా, దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి.

మొదటి దారుణం..దంపతులు/స్నేహితులపై దాడి

తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి మే 30న పౌర్ణమి గిరిప్రదక్షిణకు వచ్చారు. రాత్రి వేళ ప్రదక్షిణ ముగించుకుని తిరుగుపయనమైన క్రమంలో, పెద్దకోలాపాడి వద్ద ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఓ ముఠా మారణాయుధాలతో దాడి చేసింది. వారిని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగక, ఇద్దరినీ నగ్నంగా వీడియో తీసి, రూ. లక్ష ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. బాధితురాలు ధర్మపురి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

రెండో ఘటన.. 23 ఏండ్ల యువతిపై గ్యాంగ్‌రే*ప్

మే 31వ తేదీ రాత్రి తిరువణ్ణామలైకి చెందిన 23 ఏళ్ల యువతి గిరిప్రదక్షిణ చేస్తుండగా కాళ్లనొప్పులు రావడంతో అడిఅణ్ణామలై వద్ద ఆగింది. అక్కడ తన స్నేహితుడిని పిలిపించుకుని, టిఫిన్ తీసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్ద కూర్చున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దుండగులు వారిని బెదిరించి, సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులను నగ్నంగా వీడియోలు తీసి, ఆమె బంగారు కమ్మలను దోచుకెళ్లారు.

పోలీసుల వేట.. 8 మంది అరెస్ట్

ఈ రెండు కేసులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ దారుణాల్లో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్ శర్మ, అరుణ్ కుమార్, శివగణేశన్ , ఒక మైనర్‌తో సహా ఎనిమిది మందిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Also Read: పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Related News

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

Big Stories

×